Pandemic: వచ్చే పదేళ్లలో మరో కొవిడ్ తరహా మహమ్మారి.. హెచ్చరించిన పరిశోధన సంస్థ
Pandemic: వివిధ కారణాల వల్ల వచ్చే దశాబ్ద కాలంలో మరో మహమ్మారి వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉందని లండన్కు చెందిన ఓ పరిశోధన సంస్థ తెలిపింది. వేగంగా వ్యాక్సిన్లను ఆవిష్కరించడం వల్ల వాటిని అడ్డుకోవచ్చని పేర్కొంది.
లండన్: ప్రపంచాన్ని కరోనా వైరస్ (Coronavirus) అతలాకుతలం చేసింది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి (Pandemic) లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక మూల కొత్త రూపం సంతరించుకొని మానవాళిని భయపెడుతూనే ఉంది. అయితే, లండన్ కేంద్రంగా జరిగిన ఓ తాజా పరిశోధన మరో ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. వచ్చే పదేళ్లలో కొవిడ్ తరహా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు కరోనా వైరస్కు ఉన్నంత తీవ్రతతో మరో మహమ్మారి (Pandemic) వచ్చే అవకాశం 27.5% ఉన్నట్లు ఆరోగ్య విశ్లేషణా సంస్థ ‘ఎయిర్ఫినిటీ లిమిటెడ్’ వెల్లడించింది. వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం, జనాభా పెరుగుదల, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యం ఉన్న కొత్త వ్యాధులు పుట్టుకు రావడం వంటి కారణాలు అందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. అయితే, 100 రోజుల్లోగా సమర్థమైన వ్యాక్సిన్లను ఆవిష్కరించగలిగితే.. వాటిని నివారించే అవకాశం ఉంటుందని తెలిపింది.
మనిషి నుంచి మనిషికి వ్యాపించేలా పరివర్తన చెందగలిగే అవకాశం ఉన్న బర్డ్ఫ్లూ తరహా వైరస్లు వెలుగులోకి వస్తే.. యూకేలో ఒకే రోజు 15,000 మంది మరణించే ప్రమాదం ఉంటుందని ఎయిర్ఫినిటీ తెలిపింది. భారత్లో ఇప్పటికే సార్స్, మెర్స్, కొవిడ్-19 (Covid-19) మహమ్మారు (Pandemic)లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్5ఎన్1 బర్డ్ఫ్లూ స్ట్రెయిన్ ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇప్పటి వరకు దీనివల్ల చాలా తక్కువ మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారు. అలాగే ఇది ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తిస్తున్నట్లు ఇప్పటి వరకు ఆధారాలు లేవు. అయితే, పక్షుల్లో వేగంగా వ్యాప్తి చెందడం, క్షీరదాలకూ వ్యాప్తిస్తుండడం ఇప్పుడు పరిశోధకులను కలవరపెడుతోంది. పరివర్తనలు ఇలాగే కొనసాగితే.. వేగంగా వ్యాపించేలా వైరస్ రూపాంతరం చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
మెర్స్, జికా వంటి వ్యాధులకు కారణమవుతున్న వైరస్లను నిలువరించేందుకు ఇప్పటి వరకు నిర్దిష్టమైన టీకాలు, చికిత్స విధానాలు అందుబాటులో లేవని ఎయిర్ఫినిటీ గుర్తు చేసింది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల వల్ల కొత్త వైరస్ల ముప్పును వెంటనే పసిగట్టడం అంత సులభం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో కొత్త మహమ్మారి (Pandemic)ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!