Israel: వారి రాకెట్ గురితప్పే పేలుడు.. అల్ అహ్లి ఆసుపత్రి ఘటనపై ఐడీఎఫ్ ప్రతినిధి..!
గాజాలోని అల్ అహ్లి ఆసుపత్రిపై దాడి తమ పని కాదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. ఈ మేరకు సాక్ష్యాలను ట్విటర్లో అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో వీడియోలు, ఆడియో రికార్డింగ్లు వంటివి కూడా ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: గాజాలో ఆసుపత్రిపై దాడికి వాడిన మందుగుండు యుద్ధ విమానాలు ప్రయోగించేది వలే లేదని ఐడీఎఫ్ ప్రతినిధి వెల్లడించారు. గాజాలోని అల్ అహ్లి ఆసుపత్రిలో పేలుడుకు సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పలు ఆధారాలను ట్వీట్ చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వాస్తవానికి పేలుడు ఆసుపత్రి పార్కింగ్ ప్రదేశంలో చోటు చేసుకొందని వివరించారు. ‘‘పేలుడు చోటు చేసుకొన్న ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడలేదు. అక్కడి గోడలు కూడా బలంగానే ఉన్నాయి. ఆ పార్కింగ్లో పేలుడుకి వాడింది గగనతల దాడులకు వినియోగించే మందుగుండు కాదని తెలుస్తోంది. మా ఏరియల్ పుటేజీ విశ్లేషణలో ఆసుపత్రిని ఏదీ నేరుగా తాకలేదని తేలింది. అక్కడి పార్కింగ్ ప్రదేశం దెబ్బతిన్నది. అక్కడ కాలిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రికి అత్యంత సమీపం నుంచి రాకెట్ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ రాకెట్ కూలిపోవడంతో అందులోని ఇంధనం జాడ కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.
‘‘రాత్రి 6.59 సమయంలో ఆసుపత్రి సమీపంలోని శ్మశానం నుంచి ఇస్లామిక్ జిహాద్ సంస్థ దాదాపు 10 రాకెట్లను ప్రయోగించింది. గాజాలోని ఆసుపత్రిలో అదే సమయానికి పేలుడు వినిపించింది’’ అని డేనియల్ హగారి వెల్లడించారు. రాకెట్ గురితప్పడంపై చర్చించుకొంటున్న ఇద్దరు ఉగ్రవాదుల సంభాషణలు కూడా తమ ఇంటెలిజెన్స్ సేకరించిందన్నారు. ఈ సందర్భంగా పేలుడు తర్వాత ఇద్దరు హమాస్ ఆపరేటీవ్ల సంభాషణలను, పేలుడు ప్రదేశం ఏరియల్ వ్యూ వీడియోను కూడా ఐడీఎఫ్ ట్వీటర్లో పోస్టు చేసింది.
గాజాలోని మిలిటెంట్ సంస్థలు ప్రయోగించే రాకెట్లు మార్గం మధ్యలో కూలిపోవడం సర్వసాధారణమని హగారి వెల్లడించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 450 రాకెట్లు గాజా భూభాగంలోనే కూలిపోయాయని వివరించారు. పారదర్శకత కోసం తాము ఆధారాలను అమెరికా సహా ఇతరులతో పంచుకొంటున్నామని చెప్పారు.
యుద్ధం వేళ.. ఇజ్రాయెల్లో అందుకే అడుగుపెట్టా! జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరడానికి ముందు అల్ అహ్లి ఘటన చోటు చేసుకోంది. దీంతో జోర్డాన్, ఈజిప్ట్ నేతలతో జరగాల్సిన బైడెన్ భేటీ రద్దైంది. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని జోర్డాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా తదితర దేశాలు ఆరోపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.