Pakistan: పాక్ ఆర్మీచీఫ్గా ఇమ్రాన్ విరోధి అసీమ్ మునీర్..!
పాక్ ఆర్మీచీఫ్గా ఇమ్రాన్ ఖాన్ విరోధి అసీమ్ మునీర్ నియమితులయ్యారు. పుల్వామా ఆత్మాహుతి దాడి సమయంలో ఆయన ఐఎస్ఐ చీఫ్గా వ్యవహరించారు. దీంతో భారత్ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: పాక్ సైన్యం ఇమ్రాన్ఖాన్కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనకు బద్ధవిరోధిగా పేరున్న లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ను పాక్ ఆర్మీ చీఫ్గా నియమిస్తూ ప్రధాని షహెబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని పాక్ సమాచారశాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ ట్విటర్లో ప్రకటించారు. తొలుత ఈ పదవి కోసం లెఫ్టినెంట్ జనరళ్లు అసీమ్ మునీర్, షహిర్ షంషాద్ మిర్జా, అజర్ అబ్బాస్, నుమాన్ మహమ్మద్, ఫయాజ్ హమీద్లు పోటీపడ్డారు. వీరిలో అసీమ్ మునీర్ను పాక్ ఆర్మీ చీఫ్గా నియమించగా.. షంషాద్ మిర్జాను జాయింట్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఛైర్మన్గా నియమించారు. దీనిపై సంతకాల కోసం దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ వద్దకు ఫైల్ను పంపించారు. అసీమ్మునీర్ రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయంలో క్వార్టర్ మాస్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. తన నియామక ఆర్డర్లు రావడంలో ఎటువంటి జాప్యం ఉండకపోవచ్చని అసీమ్ మునీర్ గురువారం పేర్కొన్నారు.
గతంలో ఇమ్రాన్ ఆగ్రహానికి గురైన జనరల్..
అసీమ్ మునీర్ అంటే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఏమాత్రం గిట్టదనే ప్రచారం ఉంది. ఇమ్రాన్ భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించడమే మునీర్ చేసిన నేరం. దీంతో ఇమ్రాన్ అతడిని 30వ కోర్కు కమాండర్గా బదిలీ చేశారు. ఆయన ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టి అప్పటికి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అవుతోంది. మునీర్ స్థానంలో తనకు సన్నిహితుడైన ఫయాజ్ అహ్మద్ను ఇమ్రాన్ నియమించుకొన్న విషయం తెలిసిందే. తాజా అధికారిక పీఎంఎల్-ఎన్ పార్టీ మునీర్ పదోన్నతికి మద్దుతుగా నిలిచింది. ఇమ్రాన్ ఖాన్ కట్టడికి గట్టిగా కృషి చేస్తాడని భావిస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో కూడా ఖాన్కు ఏమాత్రం పొసగడంలేదు. ఇటీవల కాలంలో బహిరంగంగానే ఆర్మీ చీఫ్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పుల్వామా దాడి వెనుక..
2019 ఫిబ్రవరిలో అసీమ్ మునీర్ పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చీఫ్గా ఉన్న సమయంలో పుల్వామాలో భారత భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఐఎస్ఐ కనుసన్నల్లోనే పాక్ ఉగ్రవాదులు పనిచేస్తారన్న విషయం తెలిసిందే. అప్పట్లో కీలక సైనిక కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో అతడి పాత్ర కీలకం. భారత్పై ఆపరేషన్స్లో మునీర్కు అనుభవం ఉంది. కొత్త జనరల్ నియామకం భారత్-పాక్ సంబంధాలపై కూడా ప్రభావం చూపనుంది. ప్రస్తుత జనరల్ బజ్వా 2021లో భారత్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో కొత్త జనరల్ విధానం ఎలా ఉంటుందనేది భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. గతంలో కమర్ జావెద్ బజ్వా కింద మునీర్ బ్రిగేడియర్గా పనిచేశారు. ఆ తర్వాత 2017లో పాక్ మిలటరీ ఇంటెలిజెన్స్లో డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించారు. 2018 అక్టోబర్లో ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 30వ కోర్ జనరల్గా.. అనంతరం క్వార్టర్ మాస్టర్ జనరల్గా పనిచేశారు.
అత్యంత నాటకీయంగా..
ఆర్మీ చీఫ్ రేసులో మునీర్ చాలా నాటకీయంగా వచ్చి చేరారు. 2018 సెప్టెంబర్ ముందు వరకు ఆయన టూ స్టార్ జనరల్ మాత్రమే. ఆయన ఆ తర్వాత పదోన్నతులతో ఆయన లెఫ్టినెంట్ జనరల్గా ఎదిగారు. పాక్ సైన్యం నిబంధనల ప్రకారం లెఫ్టినెంట్ జనరల్గా నాలుగేళ్లు పనిచేస్తేనే ఆర్మీచీఫ్గా అవకాశం లభిస్తుంది. బజ్వా పదవీ విరమణ చేయనున్న నవంబర్ 29కి సరిగ్గా రెండు రోజుల ముందు (27వ తేదీ)తో లెఫ్టినెంట్ జనరల్గా మునీర్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. ఆ రోజు ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆయన్ను ఆర్మీచీఫ్గా ఎంపిక చేశారు. ఫలితంగా మూడేళ్లు.. అంటే 2025 వరకు మునీర్ ఈ పదవిలో కొనసాగే అవకాశం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM