Xylazine: ‘జాంబీ డ్రగ్’తో వణుకుతోన్న లాస్ ఏంజిల్స్
‘జాంబీ డ్రగ్’గా పేర్కొనే ఓ (Xylazine) మత్తుపదార్థం వినియోగం విపరీతంగా పెరగడంతో అమెరికా నగరం లాస్ ఏంజిల్స్ (Los Angeles) ఆందోళన చెందుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మాదక ద్రవ్యాల మత్తులో మునిగిపోతున్న వారితో అమెరికాలోని పలు నగరాలు నిండిపోతున్నాయి. ముఖ్యంగా మత్తుకు బానిసలుగా చేసే ప్రమాదకరమైన పదార్థాలతోపాటు చర్మాన్ని భక్షించే గుణమున్న డ్రగ్స్ వినియోగం అక్కడ భారీగా పెరిగింది. ‘జాంబీ డ్రగ్’గా (Zombie Drug) పేర్కొనే ఓ మాదకద్రవ్యం వాడకం విపరీతంగా పెరగడంతో లాస్ ఏంజిల్స్ (Los Angeles) ఆందోళన చెందుతోంది. దీంతో అప్రమత్తమైన అక్కడి అధికారులు.. ఈ డ్రగ్ వినియోగ కట్టడికి ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యారు.
ఏమిటీ జైలజైన్..?
జైలజైన్ (Xylazine) అనేది ఓ మత్తుపదార్థం. ఆవులు, గుర్రాల్లో ఉద్రేకాన్ని తగ్గించే మత్తుపదార్థంగా దీన్ని వినియోగిస్తారు. అయితే, ఇది నిషేధిత జాబితాలో లేదు. అందుకే ట్రాంక్గా పిలిచే ఈ మత్తుపదార్థాన్ని హెరాయిన్, ఫెంటానైల్ వంటి డ్రగ్స్తో కలిపి వాడుతుంటారు. ఇవి వాడటం వల్ల చర్మంపై తీవ్ర దుష్ర్పభావం కనిపిస్తుంది. చర్మంపై పుండ్లు ఏర్పడటంతోపాటు శరీర భాగాలను కుళ్లిపోయేలా చేస్తుంది. చికిత్సకు లొంగకపోతే ఆయా శరీర భాగాలను తొలగించాల్సి ఉంటుంది. మోతాదు ఎక్కువైతే ప్రాణాలు కూడా కోల్పోతారు. ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడంతో రక్తనాళాలను బలహీన పరిచి రక్తం సరఫరా మందగించేలా చేస్తుంది. చర్మాన్ని కుళ్లించే ప్రభావం ఉండటంతో దీన్ని మాంసభక్షక డ్రగ్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇది పీల్చిన వారు మితిమీరిన మత్తులో ఉండటం వల్ల దీన్ని జాంబీ డ్రగ్ అని కూడా అంటారు.
అమెరికా వ్యాప్తంగా..
అమెరికా గణాంకాల ప్రకారం.. గతేడాది పట్టుబడిన మాదక ద్రవ్యాల్లో 23శాతం జైలజైన్తో కూడిన ఫెంటానిల్ పౌడర్ ఉండగా.. ఏడు శాతం ఫెంటానిల్ బిళ్లలు ఉన్నట్లు తేలింది. గతంలో జరిపిన డోప్ నమూనా పరీక్షల్లో ఎక్కువగా జైలజైన్ ఉన్నట్లు వెల్లడైంది. అమెరికా నగరాల్లో వీటి వాడకం విపరీతంగా పెరిగింది. న్యూయార్క్లోని వీటి వాడకం వల్ల పదుల కొద్ది మరణాలు సంభవించాయని అక్కడి చట్టసభ సభ్యుడు ఇటీవల వెల్లడించారు. లాస్ ఏంజిల్స్లోనూ ఈ కేసులు పెరగడంతో అక్కడి అధికారులు డ్రగ్స్ కట్టడికి ఉపక్రమించారు. నగర వీధుల్లో జైలజైన్ వాడకంపై దృష్టి పెట్టడంతోపాటు ముందుగానే అటువంటివారిని గుర్తించడంపై శ్రద్ధ పెట్టినట్లు డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్తోపాటు లాస్ ఏంజిల్స్ కౌంటి ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!