China: కొవిడ్ నిబంధనల ఎత్తివేత తర్వాత ప్రపంచ యాత్రపై చైనీయుల ఆసక్తి..!
కొవిడ్ నిబంధనలు సడలించనున్నట్లు చైనా(china) ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు విదేశీ పర్యటనలకు ఆసక్తి చూపుతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: దాదాపు మూడేళ్లపాటు జీరోకొవిడ్ పాలసీ కారణంగా దేశానికే పరిమితమైన చైనీయులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జనవరి 8వ తేదీ నుంచి చైనా(china)లో కొవిడ్ క్వారంటైన్ నిబంధనలు పూర్తిగా సడలించనున్నట్లు మంగళవారం ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజలు ప్రపంచ పర్యటన స్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం దీనికి సంబంధించిన వార్తలు వెలువడినప్పటి నుంచి ట్రావెల్ వెబ్సైట్లకు రద్దీ విపరీతంగా పెరిగింది. చైనా(china) మీడియా లెక్కల ప్రకారం నిబంధనల సడలింపుపై ప్రచారం మొదలైన అరగంటలోనే ట్రావెల్ సైట్ల కోసం వెతికిన వారి సంఖ్య ఒక్కసారిగా 10 రెట్లు పెరిగింది. చైనా(china) ట్రావెల్ ఏజెన్సీ క్యూనరా వద్ద విమానాలపై ఆరా తీసిన వారి సంఖ్య ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.
మరోవైపు రోజువారీ విమనాల సంఖ్యపై పరిమితిని కూడా చైనా (china)ఎత్తివేసింది. దీంతోపాటు జనవరి 8వ తేదీన కొవిడ్ స్థాయి తగ్గించి బి-గ్రేడ్ ఇన్ఫెక్షన్గా ప్రకటించనుంది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రజలు విదేశాలకు వెళ్లకుండా చూసేందుకు చైనా(china) గ్రూప్, ప్యాకేజీ ట్రావెల్స్ను నిషేధించిందని డ్రాగన్ ట్రెయిల్ ఇంటర్నేషనల్ అనే మార్కెటింగ్ కంపెనీ పేర్కొంది. చైనీయులు ఎక్కువగా మకావ్, హాంకాంగ్, జపాన్, థాయ్ల్యాండ్, దక్షిణ కొరియాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్కు ముందు 2019లో చైనా(china) నుంచి ఏడాదిలో 15.5 కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కొవిడ్ మొదలైన 2020లో ఈ సంఖ్య 2 కోట్లకు పడిపోయింది. దీంతో ఈ సారి జనవరి 22తో మొదలయ్యే లూనార్ న్యూఇయర్లో వివిధ ప్రాంతాల్లోని తమ బంధువులను కలుసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
మరో పక్క చైనా(china)లో కొవిడ్ వేవ్ను చూసిన చాలా దేశాలు అక్కడి నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలను విధించాయి. ముఖ్యంగా చైనా (china)పర్యాటకులు జపాన్ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ, జపాన్ మాత్రం చైనా (china)నుంచి వచ్చే పర్యాటకులపై ఆంక్షలు విధించింది. జపాన్ చేరుకొన్నాక కొవిడ్ పరీక్షలో నెగెటివ్ రావాలని.. లేని పక్షంలో కనీసం వారం రోజులు క్వారంటైన్ ఉండాలని పేర్కొంది. ఇక భారత్లో కూడా చైనా, కొన్ని ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా కొవిడ్ టెస్ట్లో నెగెటివ్ వస్తేనే దేశంలోకి ప్రవేశం ఉంటుంది. మలేసియా కూడా చైనీయులను ట్రాకింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అమెరికా కూడా చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షల విధించే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..