Modi France Tour: ‘ఫ్రాన్స్ నేషనల్ డే’ వేడుకలు.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi France tour) జులై 13, 14 తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు.
దిల్లీ: రెండు రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్కు (France tour) బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. జులై 13, 14 తేదీల్లో మోదీ అక్కడ పర్యటిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron) ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ (Narendra Modi) అక్కడ పర్యటించనున్నారు. ఈసారి ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని హాజరుకానున్నారు.
జులై 14న పారిస్లో జరిగే ఫ్రాన్స్ నేషనల్ డే (Bastille Day) పరేడ్లో మోదీ పాల్గొంటారు. ఐరోపాలోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఈ పరేడ్లో గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఇందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటాయి. ప్రధాని గౌరవార్థం ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికారిక విందుతో పాటు ప్రైవేటు విందును కూడా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రితోపాటు సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతోనూ భేటీ అవుతారు. అనంతరం అక్కడి ప్రవాసి భారతీయులు, భారత్, ఫ్రెంచ్ సంస్థల సీఈవోలు, ఇతర ప్రముఖులతోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
ఫ్రాన్స్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ.. తిరుగు ప్రయాణంలో జులై 15న యూఏఈలో పర్యటిస్తారు. యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఫిన్టెక్, రక్షణ, సాంస్కృతిక విభాగాల్లో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చలు జరుపుతారని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.