Ukraine Crisis: ఉక్రెయిన్ను మూడు ముక్కలు చేసిన పుతిన్..
ప్రపంచం భయపడినంతా అయింది.. తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు.
నాటోకూటమికి సవాల్ విసిరిన రష్యా
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రపంచం భయపడినంతా అయ్యింది.. తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉక్రెయిన్ను మూడు ప్రాంతాలుగా ముక్కలు చేసినట్లైయింది. అప్పటికే ఉన్న ఉక్రెయిన్కు తోడు.. దొనెట్స్క్,లుహాన్స్క్ ప్రాంతాలు దేశాలుగా ఏర్పడినట్లు రష్యా గుర్తించింది. అంతటితో ఆగకుండా.. ఆ కొత్త దేశాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శాంతి పరిరక్షక దళాల పేరిట రష్యా సేనలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. అసలు ఉక్రెయిన్ ఉనికినే పుతిన్ ప్రశ్నించడం పశ్చిమ దేశాలను భయపెట్టింది.
అసలేం జరిగింది..?
పుతిన్ అధ్యక్షతన సోమవారం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు. అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు ఇక్కడ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కౌన్సిల్లో మిలటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు, విదేశాంగ మంత్రి లావ్రోవ్, ప్రధాని మిఖాయిల్ మిస్హస్టిన్ తదితరులు ఉన్నారు.
ఉక్రెయిన్ అణ్వాయుధాలు చేస్తుంది..
రష్యా జాతీయ టీవీలో నిన్న అధ్యక్షుడు పుతిన్ ప్రసంగిస్తూ పశ్చిమ దేశాల చేతిలో ఉక్రెయిన్ ఓ కీలుబొమ్మగా మారిందని అభివర్ణించారు. అక్కడ రష్యా భాష మాట్లాడేవారిని అణచివేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్కు అసలు ఎప్పుడూ సొంత దేశం హోదా లేదు. దానికి ఎప్పుడూ స్థిరమైన రాజ్యాధికారం కూడా లేదు. ఉక్రెయిన్ సొంతగా అణ్వాయుధాలు తయారు చేయగలదు. దానికి పశ్చిమ దేశాలు సాయం చేసే అవకాశం ఉంది. అదే అసలైన ముప్పు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు..
సుదీర్ఘ టెలివిజన్ ప్రసంగం అనంతరం పుతిన్ తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలైన దొనెట్స్క్,లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత డిక్లరేషన్పై సంతకం చేశారు. అదే సమయంలో వేర్పాటు వాద ప్రాంత నాయకులు పుతిన్ను సైనిక సాయం కోరారు. దీంతో రష్యా తరఫున శాంతి పరిరక్షక దళాలను పంపాలని పుతిన్ నిర్ణయించారు. ఉక్రెయిన్ నరమేధానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దీంతో ఉక్రెయిన్పై దాడి చేయడానికి దీనిని ఓ సాకుగా చూపించే అవకాశం ఉందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి.
తూర్పు ఉక్రెయిన్లోకి రష్యా సేనలు..
తూర్పు ఉక్రెయిన్లోని స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకొన్న దొనెట్స్క్ , లుహాన్స్క్ ప్రాంతాలకు రష్యా సేనలు వెళతాయని ప్రకటించారు. అక్కడ శాంతిని కాపాడేందుకు తమ దళాలు వెళుతున్నట్లు ఆయన సమర్థించుకొన్నారు. దీనికి సంబంధించిన అధ్యక్షుడి ఆదేశాలను రష్యా టీవీలో ప్రసారం చేశారు. అదే సమయంలో ఆ రెండు దేశాల్లో సైనిక స్థావరాలు నిర్మించేందుకు పదేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకొంది. దీనికి సంబంధించిన పత్రాలను కూడా రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ ఆర్ఐఏ నొవస్టీ ప్రచురించింది.
రష్యాపై ఆంక్షల కొరడా..
రష్యాపై నాటోకూటమి దేశాలు పలు ఆంక్షలు విధించాయి. వీటిల్లో ఐరోపా సమాఖ్య, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఉన్నాయి.
* ఉక్రెయిన్ నుంచి వేర్పడిన దొనెట్స్క్,లుహాన్స్క్ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారం చేయకుండా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో అమెరికా వాసులు ఎటువంటి పెట్టుబడులు పెట్టరు. ఆ ప్రాంతానికి చెందిన సరుకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోనూ అమెరికా దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు అడ్డుకోనున్నాయి.
* ఇక రష్యాపై విధించనున్న ఆంక్షలను నేడు అమెరికా ప్రకటించనుంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించినట్లు ఆంగ్ల వార్త సంస్థ బీబీసీ పేర్కొంది. మాస్కో నిర్ణయాలు, చర్యలకు ప్రతిస్పందన నేడు ఉంటుందని శ్వేత సౌధం ప్రతినిధి పేర్కొన్నారు.
* ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తగ్గించేలా పాలసీలు చేసిన ఐదుగురు డుమా సభ్యులు(రష్యా పార్లమెంట్ దిగువసభ)పై ఆంక్షలు విధించారు. వీరు గతంలో క్రిమియా ఆక్రమణలో కీలక పాత్ర పోషించారు. గతేడాది పార్లమెంట్కు ఎంపికయ్యారు.
* రష్యాపై ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ట్విటర్లో ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించిందని ఆరోపించారు. మంగళవారం ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక