Rishi Sunak: భారత్తో వాణిజ్య ఒప్పందంలో రిషి కుటుంబానికి లబ్ధి.. బ్రిటన్ ప్రధానిపై ఆరోపణలు
బ్రిటన్ ప్రధాని రుషి సునాక్పై మరోసారి విమర్శలు చెలరేగాయి. భారత్తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో ఆయన కుటుంబం లబ్ధిపొందుతుందని విపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి.
ఇంటర్నెట్డెస్క్: యూకే (UK) ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) మరో వివాదంలో చిక్కుకొన్నారు. బ్రెగ్జిట్ తర్వాత ప్రతిపాదిత భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం నుంచి సునాక్ కుటుంబం లబ్ధి పొందనుందనే ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ భార్య అక్షితా మూర్తికి ఇన్ఫోసిస్లో 500 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉండటంపై బ్రిటన్ పార్లమెంటేరియన్లు, వాణిజ్య నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్కు యూకేలోని ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూకేతో జరిగే వాణిజ్య ఒప్పందంలో ఆ కంపెనీకి లబ్ధి చేకూరేలా లబ్ధి చేకూరుతుందనే ఆందోళన వెలిబుచ్చారు.
తాజాగా బ్రిటన్లోని లేబర్ పార్టీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని సునాక్ సతీమణి అక్షితాకు ఇన్ఫీలో షేర్లు, ఆమెకు లభించే ప్రయోజనాలపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంతో ఇన్ఫోసిస్కు ఎటువంటి లబ్ధి లభిస్తుందనే అంశాలపై మరింత స్పష్టంగా వెల్లడించాలని పేర్కొన్నారు. వాణిజ్య చర్చల నుంచి సునాక్ వైదొలగాలని సూచించారు. ‘‘ప్రధానిపై ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు భారత్తో వాణిజ్య ఒప్పందం నుంచి లభించే ప్రయోజనాలు వెల్లడించాలి’’ అని బిజినెస్ అండ్ ట్రేడ్ సెలక్ట్ కమిటీ ఛైర్మన్, లేబర్ పార్టీ నేత డారెన్ జోన్స్ పేర్కొన్నారు.
విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!
తాజా ప్రతిపాదిత ఒప్పందంలో ఐటీ, కృత్రిమ మేధ రంగాల్లోని నిపుణులకు సులువుగా వీసాలు ఇవ్వాలని భారత్ పట్టుబడుతోంది. మరో వైపు భారత్కు ఎగుమతి చేసే స్కాచ్ విస్కీ, కార్లపై పన్నులు తగ్గించాలని బ్రిటన్ డిమాండ్ చేస్తోంది. అక్షితా మూర్తికి ఛైల్డ్ కేర్ సంస్థలో ఉన్న వాటాలను సరిగ్గా వెల్లడించలేదని యూకే పార్లమెంట్ స్టాండర్డ్స్ వాచ్డాగ్ ఇటీవల వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిషి సునాక్పై మళ్లీ ఆరోపణలు చెలరేగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.