Suicide bomber: భారత ప్రముఖ నేతపై ఆత్మాహుతి దాడికి కుట్ర..!

భారత్‌లో ఉగ్రదాడికి కుట్రపన్నిన ఐసిస్ ఉగ్రవాదిని రష్యా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది.

Published : 22 Aug 2022 14:35 IST

సూసైడ్‌ బాంబర్‌ను అదుపులోకి తీసుకున్న రష్యా

మాస్కో: భారత్‌లో ఉగ్రదాడికి కుట్రపన్నిన ఐసిస్ ఉగ్రవాదిని రష్యా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. ఆ దేశ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించిన సమాచారం మేరకు.. ఐసిస్ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి బాంబర్‌ను రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌(FSB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాంబర్‌ భారత్‌లోని ఓ ప్రముఖ నాయకుడిపై ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు కుట్రపన్నాడని ఎఫ్‌స్‌బీ అధికారులు వెల్లడించినట్లు తెలిపింది.

‘రష్యాలో నిషేధానికి గురైన ఇస్లామిక్ స్టేట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కు చెందిన సభ్యుడిని ఎఫ్‌ఎస్‌బీ గుర్తించి, అదుపులోకి తీసుకుంది. అతడు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవాడు. భారత్‌లోని పాలక వర్గాలకు చెందిన ఓ వ్యక్తిని హత్యచేసేందుకు ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నాడు’ అని సంబంధిత అధికారులు ప్రకటించారు. 

ఇదిలా ఉండగా.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రం ఐసిస్‌ను ఉగ్రసంస్థగా నోటిఫై చేసింది. ఈ సంస్థ తన సిద్దాంతాలను వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తోందని, దీనిపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయని కేంద్రమంత్రి వర్గాలు వెల్లడించాయి. చట్ట ప్రకారం తగిన చర్యలుంటాయని పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని