Parag Agrawal: ట్విటర్ కొనుగోలు.. తన గురించి ఆలోచించేవారికి పరాగ్ సమాధానాలివే..!
ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ను టెస్లా సీఈఓ ఎలాన్మస్క్ కొనుగోలు చేయడంతో అందరి దృష్టి కొద్ది నెలల క్రితం సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్పై పడింది.
కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ను టెస్లా సీఈఓ ఎలాన్మస్క్ కొనుగోలు చేయడంతో అందరి దృష్టి కొద్ది నెలల క్రితం సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్పై పడింది. ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొందరు నెట్టింట్లో తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కానీ పరాగ్ మాత్రం ట్విటర్లో తన భవిష్యత్తుపై నమ్మకంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చే సమాధానాలు ఆ వైఖరిని వెల్లడిస్తున్నాయి.
‘నేను ట్విటర్ ప్రస్తుత సీఈఓ గురించి ఆలోచిస్తున్నాను. సంస్థ కోసం ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం అనిశ్చితి నెలకొని ఉంది’ అంటూ ఓ సుహైల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. అందుకు పరాగ్ వెంటనే స్పందించారు. తన గురించి ఆలోచించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మీకు కృతజ్ఞతలు. కానీ నా గురించి ఆలోచించొద్దు. ఇక్కడ ముఖ్యమైనది వినియోగదారులకు సరైన సేవలు అందించడమే’ అంటూ తాజా పరిణామంతో సంబంధం లేదన్నట్టుగా స్పందించారు. అలాగే ‘నాట్ పరాగ్ అగర్వాల్’ అనే పేరుతో ఉన్న మరో నెటిజన్.. ‘మనందరిని తొలగించారనుకున్నాను’ అంటూ ట్వీట్ చేయగా..‘లేదు, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం’ అంటూ సీఈఓ సమాధానమిచ్చారు. అలాగే ఈ క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తోన్న తన బృందం పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పారు.
ట్విటర్ మస్క్ సొంతమైందని తెలిసిన తర్వాత.. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్పందించారు. ‘గరిష్ఠ విశ్వసనీయత, కలుపుకొని పోయే విధంగా సంస్థను మార్చాలనుకునే విషయంలో ఎలాన్ ఆలోచన సరైంది. పరాగ్ శైలి కూడా ఇదే. అందుకే ఆయన్ను సీఈఓగా ఎంచుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి సంస్థను గట్టెక్కించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఇదే సరైన మార్గం’ అని ఈ టేకోవర్పై ట్వీట్ చేశారు. ఆయన మాటల్లో పరాగ్పై విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పరాగ్ ట్విటర్లో కొనసాగుతారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఒప్పందం పూర్తయిన తర్వాత 12 నెలల్లోపు ఆయన్ను తొలగిస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. జాక్ డోర్సే స్థానంలో పరాగ్ గత ఏడాది నవంబరులో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆయన 30.4 మిలియన్ డాలర్లు పరిహారంగా పొందినట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీలో ఆయనకున్న ఇతర గ్రాంట్లు, బోనస్లు అన్నీ కలుపుకొని 42 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.321.78 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక