Ukraine Crisis: రష్యాకు ఆధునిక ఆయుధాల కొరత?
సైనిక చర్య పేరిట ఉక్రెయిన్లో రష్యా భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కో సేనలు అక్కడి భూతల లక్ష్యాలపై దాడుల కోసం 1960ల నాటి ‘కేహెచ్-22’ భారీ యాంటీ-షిప్ మిసైళ్లను...
ఉక్రెయిన్ భూతల లక్ష్యాలపై 1960ల నాటి క్షిపణుల ప్రయోగం!
ఇంటర్నెట్ డెస్క్: సైనిక చర్య పేరిట ఉక్రెయిన్లో రష్యా భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాస్కో సేనలు అక్కడి భూతల లక్ష్యాలపై దాడుల కోసం 1960ల నాటి ‘కేహెచ్-22’ భారీ యాంటీ-షిప్ మిసైళ్లను ప్రయోగిస్తున్నాయని బ్రిటన్ రక్షణశాఖ తన తాజా ఇంటెలిజెన్స్ నివేదికలో తెలిపింది. అణు వార్హెడ్లతో కూడిన ఈ సంప్రదాయ క్షిపణులు వాస్తవంగా యుద్ధ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసేందుకు వీలుగా రూపొందించినవి. ఒక్కోటి 5.5 టన్నుల బరువు ఉంటుంది. ‘ఏప్రిల్ నుంచి రష్యా డజన్ల కొద్ది.. కేహెచ్-22 మిసైళ్లను ప్రయోగించి ఉండొచ్చు. కానీ, నౌకలపై దాడుల కోసం ఉద్దేశించిన ఈ క్షిపణులను భూభాగంపై ఉపయోగించడం సరికాదు. వాటికి కచ్చితత్వం ఉండదు. ఫలితంగా తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుంది’ అని పేర్కొంది.
కచ్చితత్వంతోకూడిన ఆధునిక క్షిపణుల కొరత కారణంగానే రష్యా ఇలాంటి పనికిరాని ఆయుధాలను ఉపయోగిస్తోందని బ్రిటన్ రక్షణ శాఖ అభిప్రాయపడింది. అయితే, ఈ క్షిపణులను ఎక్కడ ప్రయోగించిందో వివరాలు ఇవ్వలేదు. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇప్పటికీ రష్యా వాయుసేన దాడులను అడ్డుకుంటున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. డాన్బాస్లోని సీవీరోదొనెట్స్క్పై పట్టు కోసం ఇరు పక్షాల మధ్య హోరాహోరి పోరు సాగుతోందనీ బ్రిటన్ తన నివేదికలో వెల్లడించింది. శుక్రవారం నాటికి రష్యన్ బలగాలు నగరంలోని దక్షిణ దిశగా పురోగతి సాధించలేకపోయాయని చెప్పింది. పుతిన్ బలగాలు.. ఫిరంగి దళాలు, వైమానిక సామర్థ్యాలతో ఉక్రెయిన్ను అణచివేసేందుకు యత్నిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు.. తూర్పు దొనెట్స్క్లోని స్లోవియాన్స్క్ నగరంపైనా దాడులకు మాస్కో సన్నద్ధమవుతోందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు