Zelensky: మీరు చేస్తోన్న సాయం గురించి మా పుస్తకాల్లో రాసుకుంటాం..!
రష్యాను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా చేస్తోన్న సహాయం ఉక్రెయిన్ చరిత్రలో నిలిచిపోతుందని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. అయితే పుతిన్ సేనలు చేస్తోన్న దురాక్రమణను అడ్డుకునేందుకు మరింత సాయం కావాలని అభ్యర్థించారు.
కీవ్: రష్యాను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా చేస్తోన్న సహాయం ఉక్రెయిన్ చరిత్రలో నిలిచిపోతుందని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అన్నారు. అయితే పుతిన్ సేనలు చేస్తోన్న దురాక్రమణను అడ్డుకునేందుకు మరింత సాయం కావాలని అభ్యర్థించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు విషయాలు వెల్లడించారు. ఈ యుద్ధ సమయంలో చూసిన భయానక దృశ్యాలు, ఐరోపాకు పొంచి ఉన్న అణు ప్రమాదం గురించి మాట్లాడారు. వారం రోజుల్లో ముగించుకువద్దామని రష్యా దాడిని ప్రారంభించిందని, ఇన్ని రోజులుగా దానిని ఎదిరించి నిలిచేందుకు తమకు అందుతోన్న సహాయం గురించి ప్రస్తావించారు.
‘ఆస్ట్రేలియా ప్రజల విషయంలో మేం కృతజ్ఞతతో ఉండాలి. ఇప్పటికే మీరు మాకు సహాయం చేశారు. అది నిజం. కానీ మాకు మీ సహాయం ఇంకా కావాలి. అది కూడా నిజం. నన్ను క్షమించండి. యుద్ధంలో పోరాడుతోన్న దేశానికి నేను అధ్యక్షుడిని. నా ఆవేదనను మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఉక్రెయిన్ మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మీరు అందించిన సహకారం మా చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటాం’ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.
రష్యా పాల్పడుతోన్న యుద్ధ నేరాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని జెలెన్స్కీ అన్నారు. ‘సామాన్య ప్రజలపై జరుగుతోన్న దాడులు చూస్తుంటే.. బాధ, కోపం కలిగింది. ప్రతికారం తీర్చుకోవాలనిపించింది. అంత మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారనిపించింది. మీరు మీ మానవత్వాన్ని కోల్పోయినా, నేను దానిని వదులుకోదల్చుకోలేదు. ఈ విధమైన బలహీనత గురించి చెప్పడానికి భయపడదల్చుకోలేదు. అందుకే నేను అన్నింటిని చూస్తున్నాను. యుద్ధాన్ని జీవితంలో భాగంగా చేసుకోవడం.. ఒక చెత్త అలవాటు. ఈ యుద్ధంలో నా ప్రజలు, సైనికులు పోరాడుతున్నారు. ఎన్నో బాధలు పడుతున్నారు’ అంటూ రష్యాపై విరుచుకుపడ్డారు. ఇలా దూకుడుగా వ్యవహరిస్తోన్న రష్యా.. చెర్నోబిల్ ప్రాంతంలో అణ్వాయుధాలను ఉపయోగించదని తామేమీ ఆశించడం లేదన్నారు.
11 లక్షల మంది ఉక్రెయిన్ వాసులు రష్యాకు...
‘రష్యా బలవంతంగా 11 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలను తన దేశానికి తరలించింది. వారిలో రెండు లక్షల మంది చిన్నారులున్నారు. రష్యా ఆక్రమిత ప్రాంతమైన డాన్బాస్ నుంచి వారిని తరలించింది’ అంటూ ఉక్రెయిన్ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. సోమవారం 11,500 మందిని తరలించగా.. వారిలో 1,847 మంది పిల్లలున్నారని పేర్కొంది. అయితే ఆ ప్రజల అభ్యర్థన మేరకే వారిని తరలించామని రష్యా చెప్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
లైంగిక నేరారోపణల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్(72)కు ఓ కేసులో ఊరట లభించింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్