Ukraine Tragedy: అమ్మా.. మళ్లీ మనం స్వర్గంలో కలుద్దాం..!
రష్యా దాడిలో చనిపోయిన తల్లిని స్మరించుకుంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి భావోద్వేగంతో రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది.
కంటతడి పెట్టిస్తోన్న తొమ్మిదేళ్ల చిన్నారి లేఖ
కీవ్: రష్యా సైన్యం భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుచా వంటి నగరాల్లో నగరాల్లో రష్యా సైనికులు ఆకృత్యాలు యావత్ ప్రపంచాన్ని నిశ్చేష్టులను చేస్తున్నాయి. ఈ క్రమంలో సైన్యం దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోతున్న చిన్నారులు ఆవేదన వర్ణనాతీతం. బొరొడియెంక నగరంలో ఇటువంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యా దాడిలో చనిపోయిన తల్లిని స్మరించుకుంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి భావోద్వేగంతో రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది. అమ్మ చెప్పినట్లుగా ఓ మంచి అమ్మాయిగా పేరుతెచ్చుకుంటానని.. తద్వారా మళ్లీ తనను స్వర్గంలో కలుసుకోవచ్చంటూ రాసిన లేఖ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
‘అమ్మా.. మార్చి 8న రాస్తున్న ఈ లేఖ నీకు అంకితం. తొమ్మిదేళ్లు నా జీవితంలో మరచిపోలేని రోజులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా బాల్యంలో నీవు ఉన్నందుకు ఎంతో కృతజ్ఞురాలిని. ప్రపంచంలో బెస్ట్ అమ్మవు నీవే. నిన్నెప్పటికీ మరచిపోను. ఆకాశంలో నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నీవు స్వర్గానికి వెళ్లాలని ఆకాంక్షిస్తున్నా. మళ్లీ మనం స్వర్గంలో కలుద్దాం. నేను కూడా అక్కడకు (స్వర్గానికి) రావడానికి మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటా. అందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. కిస్ యూ అమ్మా..’ అంటూ తొమ్మిదేళ్ల చిన్నారి తన డైరీలో రాసుకుంది. ఈ చిన్నారి రాసుకున్న లేఖను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారుడు ఆంటోన్ గెరషెంకో ట్విటర్లో షేర్ చేశారు.
ఇదిలాఉంటే, ఉక్రెయిన్లో సామాన్యులపై కనికరం లేకుండా రష్యా సేనలు చేస్తోన్న దాడులకు ఎంతోమంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బొరొడియెంక నగరంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ కుటుంబంపై రష్యా సేనలు దాడి జరిపాయి. ఆ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అనంతరం ఆమెను గుర్తు చేసుకుంటూ తొమ్మిదేళ్ల కూతురు గలియా తన డైరీలో రాసుకున్న లేఖ ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!