Ukraine Crisis: ‘శత్రువు మమ్మల్ని చుట్టుముట్టింది.. ఇదే మా ఆఖరి పోరాటం కావొచ్చు..’!
రష్యా చేతుల్లో ఉండిపోయిన మేరియుపొల్ నగరాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ సేనలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ‘చివరిపోరు’కు సిద్ధమవుతున్నట్లు 36వ మెరైన్ బ్రిగేడ్ ఫేస్బుక్ వేదికగా ప్రకటించింది.
కీవ్: రష్యా చేతుల్లో తీవ్ర విధ్వంసానికి గురైన మేరియుపొల్ నగరాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఉక్రెయిన్ సేనలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ‘ఆఖరి పోరు’కు సిద్ధమవుతున్నట్టు 36వ మెరైన్ బ్రిగేడ్ ఫేస్బుక్ వేదికగా ప్రకటించింది. చుట్టుముట్టిన రష్యన్ సేనల ముందు నెగ్గలేమని తెలిసినా.. తమ ప్రయత్నాన్ని మాత్రం కొనసాగించనున్నట్లు తెలిపింది.
‘‘పోరాటం చేయడానికి కావాల్సిన ఆయుధాలు నిండుకుంటున్నాయి. ఇక ఇదే మా చివరి పోరాటం కావొచ్చు. మాలో కొందరు మరణించవచ్చు. మరికొందరు బందీలు కావొచ్చు’ అంటూ ఫలితం తెలిసినా.. వీరోచితంగా ముందుకు వెళ్లేందుకే సిద్ధమైంది. ‘గత 47 రోజులుగా ఈ నగరాన్ని రక్షించుకోవడానికి సాధ్యమైనంత చేశాం. కానీ శత్రువు మమ్మల్ని క్రమంగా వెనక్కి నెట్టింది. బాంబులతో మమ్మల్ని చుట్టుముట్టింది. చివరకు మమ్మల్ని ధ్వంసం చేయడానికి సిద్ధమైంది. మా బ్రిగేడ్లో సగం మంది గాయాలపాలయ్యారు. చాలామంది మరణించడంతో ఉన్నవాళ్లతో సిద్ధమవుతున్నాం’ అంటూ వెల్లడించింది. అయితే తమకు ఉక్రెయిన్ సైనికాధికారుల నుంచి కమ్యూనికేషన్ లేదని ఫిర్యాదు చేసింది.
రష్యా దురాక్రమణ ప్రారంభమైనప్పట్నుంచి మేరియుపొల్ తీవ్రంగా ధ్వంసం అవుతోంది. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆ ప్రాంతం నుంచి రష్యా సేనలు వీడిన తర్వాత ఎలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందోనని ఉక్రెయిన్ నాయకత్వం తీవ్ర ఆందోళనతో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక