USA Drone: రష్యాదే తప్పు.. ఇదిగో సాక్ష్యం: అమెరికా
నల్లసముద్రం (Black sea)లో అమెరికాకు చెందిన నిఘా డ్రోన్ (Drone) కూలిపోవడంపై అమెరికా,రష్యాల మధ్య ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. రష్యాదే తప్పు అని నిరూపించేందుకు గానూ ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా విడుదల చేసింది.
వాషింగ్టన్: నల్లసముద్రం (Black sea)లో అమెరికా (USA) నిఘా డ్రోన్ (Drone) కూల్చివేత ఘటనపై ఇరుదేశాలూ వెనక్కి తగ్గడం లేదు. తప్పు మీదంటే మీదని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి అమెరికా తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. వేగంగా దూసుకెళ్తున్న ఫైటర్ జెట్.. ఒక్కసారిగా ఇంధనాన్ని వెళ్లగక్కుతున్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా యూరోపియన్ కమాండ్ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ‘‘ రష్యాకు చెందిన ఎస్యూ-27 జెట్ విమానం.. అమెరికా సైన్యానికి చెందిన ఎంక్యూ-9పై ఇంధనం చల్లింది. అక్కడికి సెకెన్ల వ్యవధిలోనే మరో రష్యన్ జెట్ మళ్లీ ఇంధనాన్ని డ్రోన్ మీదకి చల్లింది. ఆ తర్వాత నేరుగా ప్రొఫెల్లర్ను ఢీ కొట్టింది. దీంతో నిఘా డ్రోన్ కూలిపోయింది.’’ అని యూఎస్ యూరోపియన్ కమాండ్ రాసుకొచ్చింది.
మరోవైపు అమెరికా నిఘా డ్రోన్పై రష్యా కావాలనే ఇంధనం చల్లి, ఆ తర్వాత ఢీ కొట్టిందని అమెరికా మిలటరీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది రష్యా నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని మండిపడింది. ‘‘డ్రోన్ను ఢీ కొట్టడానికి ముందు రష్యాకు చెందిన ఎస్యూ- 27 అనేక సార్లు ఇంధనాన్ని చల్లింది. ఎంక్యూ-9కి అతి సమీపం నుంచి ప్రయాణించింది. వాతావరణంలోకి ఇంధనాన్ని విడుదల చేస్తూ పర్యావరణానికి హాని కలిగేలా ప్రవర్తిస్తూ రష్యా.. అనైతిక చర్యలకు పాల్పడింది.’’ అని అమెరికా మిలటరీ ఆరోపించింది. అయితే, అమెరికా ఆరోపణలను రష్యా ఖండించింది. అమెరికా నిఘా డ్రోన్ ఎంక్యూ 9 నియంత్రణ కోల్పోయి ఎస్యూ-27 జెట్ ప్రయాణిస్తున్న మార్గంలోకి చొచ్చుకొచ్చిందని, జెట్ను ఢీ కొట్టి సముద్రంలో కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఈ ఘటనలో రష్యా ఎలాంటి ఆయుధాలను ఉపయోగించలేదని స్పష్టం చేసింది.
మంగళవారం నల్ల సముద్రం ఉపరితల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ఇరుదేశాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. దీన్ని కవ్వింపు చర్యగా మాస్కో అభివర్ణించింది. అగ్రరాజ్యం మాత్రం అమెరికా ఆస్తులకు దగ్గరగా ఎగురుతున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. యూఎస్లోని రష్యా రాయబారి అనతోలి ఆంటనోవ్ను అమెరికా పిలిపించి మాట్లాడింది. తమ దేశ ఆస్తులకు సమీప గగనతలంలో ఎగురుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు మాస్కోలో రష్యా అధికారులు కూడా నేరుగా అమెరికాపై గురిపెట్టారు. ‘‘సైనిక అంశాల్లో మేం పాలుపంచుకోవడం లేదని అమెరికన్లు చెబుతున్నారు. కానీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నదానికి ఈ డ్రోన్ సంఘటనే నిదర్శనం’’ అని ఓ ప్రతినిధి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
ఇజ్రాయెల్-హమాస్ (Israel) మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో రఫాపై ఐడీఎఫ్ దండయాత్ర మొదలు పెట్టినట్లు స్థానికులు వెల్లడించారు. -
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
అమెరికాలో ఏం చేసినా భారీగా ఉండాల్సిందేనేమో.. అది దుబారా వ్యయమైనా సరే. తాజాగా కొన్ని వందల అడుగుల వంతెనకు ఏకంగా రూ.91 వేల కోట్లు వెచ్చించి కాలిఫోర్నియా విమర్శల పాలవుతోంది. -
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?