Corona: ఫ్రాన్స్లో కరోనా కొత్త వేవ్.. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ వెల్లడి
ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కరోనా కొత్త వేవ్ను ఎదుర్కొంటున్నట్లు తాజాగా ఆయన వెల్లడించారు.
ఫ్రాన్స్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ (Covid) సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కొత్త వేరియంట్లతో కరోనా (Corona) వైరస్ ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కొత్త వేవ్ (New Wave) వస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ (France) వ్యాక్సినేషన్ (Vaccination) చీఫ్ అలైన్ ఫిషర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కరోనా కొత్త వేవ్ను ఎదుర్కొంటున్నట్లు తాజాగా వెల్లడించారు.
ఫ్రాన్స్లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అక్కడ ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు సంఖ్య దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అలైన్ ఫిషర్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ.. దేశంలో కరోనా కేసుల పెరుగుదలను చూస్తుంటే మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. తాము కరోనా కొత్త వేవ్ను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అయితే, కొత్త వేవ్ తీవ్రత ఎంత వరకు ఉంటుందనేది మాత్రం చెప్పలేమన్నారు. కాబట్టి దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజా రవాణాలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫ్రాన్స్లో గత నెల చివరి వారం నుంచి కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏడు రోజుల వ్యవధిలో అక్కడ రోజువారీ కేసులు మూడు రెట్లు పెరగడం గమనార్హం. మే 27న 17,705 కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్కరోజే 50,402 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా యూరోపియన్ దేశాల్లో ముఖ్యంగా పోర్చుగల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ సబ్వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వేగంగా వ్యాప్తి చెందడం వల్లే కేసులు అధికంగా నమోదవుతున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీస్ అండ్ కంట్రోల్(ఈసీడీసీ) వెల్లడించింది. అయితే, ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలే కనిపించడం కొంత ఊరట కలిగించే విషయం. కొత్త వేరియంట్లు రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారితే మాత్రం ఆసుపత్రిలో చేరికలు, మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని ఈసీడీసీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM