Telangana news: కుమారుడి హత్యకేసులో న్యాయం చేయాలని ప్రగతి భవన్కు చేరిన కుటుంబం..
కుమారుడి హత్య విషయంలో నేరస్థులకు శిక్ష పడేలా తమకు న్యాయం చేయాలంటూ ఓ కుటుంబం ప్రగతిభవన్కు చేరుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము, లక్ష్మి దంపతుల కుమారుడు గతేడాది చనిపోయాడు. కొంత మంది తమ బిడ్డను హత్య చేశారంటూ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు తమకు పట్టించుకోవడం లేదంటూ లేదంటూ శనివారం ముఖ్యమంత్రి కలిసేందుకు ప్రగతిభవన్కు చేరుకున్నారు.
Published : 30 Apr 2022 15:44 IST
Tags :