Btech Ravi: పేదవాడు ఎవరో? పెత్తందారు ఎవరో? ప్రజలు ఆలోచించుకోవాలి: బీటెక్‌ రవి

ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెదేపా నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్‌ రవి విమర్శించారు.

Updated : 26 Apr 2024 14:27 IST

ఆంధ్రప్రదేశ్‌లో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెదేపా నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్‌ రవి విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని ఆయన ఊదరగొడుతున్నారన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.750కోట్ల ఆస్తులు ఉన్నట్లు జగన్‌ పేర్కొన్నారని.. ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తి దాదాపు రూ.80 లక్షలు మాత్రమేనని బీటెక్‌ రవి చెప్పారు. దీన్ని బట్టి పేదవాడు ఎవరో? పెత్తందారు ఎవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.

Tags :

మరిన్ని