Jagdeep Dhankar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌

తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankar) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు.

Published : 26 Apr 2024 15:40 IST

తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankar) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు తితిదే ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా.. స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలను ఈవో ధర్మారెడ్డి అందజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు