CM Revanth: నేనుంటే తమ కుట్రలు సాగవని భారాస నేతలు భావిస్తున్నారు: సీఎం రేవంత్‌

హరీశ్‌రావు సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు.

Published : 26 Apr 2024 18:09 IST

  హరీశ్‌రావు సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లదని తెలిపారు. ‘‘కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. రేవంత్‌ లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి భారాస నేతలు వచ్చారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సెమీఫైనల్స్‌ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్‌ ఆడుతున్నాం. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టు లాంటి కేసీఆర్‌ను ఓడించాం. ఇప్పుడు పాకిస్థాన్‌ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి’’ అని రేవంత్‌ అన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు