Hyderabad: తెలుగు సినిమాలపై ఆవేదన వ్యక్తం చేసిన జస్టిస్ ఎన్.వి. రమణ..
నేటి తరం తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలు స్వల్పకాలిక వినోదానికి మాత్రమే పరిమితమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. నాటి రోజుల్లో వచ్చిన సినిమాలు మనసులను హత్తుకునేలా ఉండేవన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలిసారి రచించిన ‘నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకావిష్కరణ సందర్భంగా జస్టిస్ ఎన్వీరమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published : 14 May 2022 09:48 IST
Tags :