Aditya L1: ఆదిత్య-ఎల్1 మిషన్లో కీలక ఘట్టం.. నేడు తుది కక్ష్యలోకి ప్రవేశం
సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో (ISRO) గతేడాది సెప్టెంబరు 2న నింగిలోకి పంపిన ఆదిత్య-ఎల్1ను (Aditya L1) శనివారం సాయంత్రం తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ నింగిలోకి వెళ్లాక నాలుగు విన్యాసాలు, ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్-1 ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కి.మీ. దూరంలోని మొదటి సూర్య-భూమి లగ్రాంజియన్ పాయింట్(ఎల్1) చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించడానికి రూపొందించిన తొలి భారత అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా ఆదిత్య-ఎల్1 నిలవనుంది.
Updated : 06 Jan 2024 10:54 IST
Tags :