Karnaprayag: కర్ణ ప్రయాగ్లోనూ ఇళ్లకు పగుళ్లు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు!
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ తర్వాత కర్ణ ప్రయాగ్లోనూ ఇళ్లలో పగుళ్లు దర్శనమిచ్చాయి. మొత్తం 38 ఇళ్లలో ఈ పగుళ్లు కనిపించాయి. కర్ణ ప్రయాగ్ పట్టణం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉంది. జోషిమఠ్లో పగుళ్లు కనిపించిన ఇళ్లలోని కుటుంబాలను ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం కర్ణ ప్రయాగ్లో కూడా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Updated : 06 Feb 2023 18:14 IST
Tags :