Helicopter Ride: టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు హెలికాప్టర్లో విహారం.. ఎక్కడంటే..!
ఛత్తీస్గఢ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు హెలికాప్టర్లో విహరించే అవకాశం దక్కింది. పది, పన్నెండు తరగతుల్లో టాపర్లుగా నిలిచిన 10మంది విద్యార్థినులు రాయ్పుర్ గగనవీధిలో విహరించారు. పది, పన్నెండు తరగతుల్లో.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 10మంది విద్యార్థులకు హెలికాప్టర్లో ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు ఛత్తీస్గడ్ సీఎం భూపేశ్ బఘేల్ మే నెలలో ప్రకటించారు. ఆ మేరకు ఆయా తరగతుల్లో టాపర్లుగా నిలిచిన పది మంది విద్యార్థినులను హెలికాప్టర్లో తిప్పినట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. తొలిసారి హెలికాప్టర్లో ప్రయాణించడంపై విద్యార్థినులు సంతోషం వ్యక్తంచేశారు.
Published : 08 Oct 2022 16:30 IST
Tags :