Cm Kcr: మమతా బెనర్జీ సమావేశంపై తెరాస తర్జనభర్జన
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలపై బుధవారం దిల్లీలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించే సమావేశంపై తెరాస తర్జనభర్జన పడుతోంది. సీఎం కేసీఆర్ హాజరు కాకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున ప్రతినిధులను పంపించాలా?వద్దా? అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీ ప్రతినిధులు సమావేశానికి హాజరైతే ఎలా స్పందించాలి.. వెళ్లకపోతే జరిగే లాభనష్టాలేంటనే అంశంపై రెండు రోజులుగా సుదీర్ఘ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Published : 14 Jun 2022 21:32 IST
Tags :