Fire Accident: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి నుంచి కోదాడ వెళుతున్న తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి కిందకి దింపడంతో ముప్పు తప్పింది.

Published : 29 Apr 2024 12:12 IST

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి నుంచి కోదాడ వెళుతున్న తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌కు అనుమానం రావడంతో బస్సును పక్కకు ఆపి పరిశీలించగా ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించారు. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి కిందకి దింపడంతో ముప్పు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు, ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Tags :

మరిన్ని