Kadiyam Srihari: లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టబోం!: కడియం శ్రీహరి
ఎట్టి పరిస్థితిలోనూ లింగంపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టబోమని భారాస నేత కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో దేవాదుల ఎత్తిపోతల పథకం గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. లక్ష పైచిలుకు ఎకరాలకు సాగునీరు లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారని శ్రీహరి చెప్పారు. అదే సందర్భంలో లింగంపల్లి రిజర్వాయర్ ప్రస్తావన కూడా సీఎం తెచ్చారని.. అయితే అది అవసరం లేదని తాను చెప్పానని వెల్లడించారు. దీంతో సీఎం సైతం అదే అభిప్రాయంతో ఏకీభవించారని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు.
Published : 22 Nov 2023 14:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..