TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ.. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరణ
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కస్టడీలోని నిందితుల నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. కమిషన్ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మిన్గా రాజశేఖర్ రెడ్డి.. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు ఎంతో పకడ్బందీగా పథకం వేసినట్టు తాజాగా గుర్తించింది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే రాజశేఖర్ రెడ్డి ప్రశ్నపత్రాలపై కన్నేశాడని.. నెట్ వర్క్ అడ్మిన్గా తనకున్న స్వేచ్ఛను వినియోగించుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గ్రూప్-1 పరీక్ష పేపర్లు తస్కరించే క్రమంలో నాలుగుసార్లు విఫలమైనట్టు తేలింది.
Published : 21 Mar 2023 09:26 IST
Tags :