Adilabad: లక్ష్మీనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు.. సువర్ణ శోభితంగా వెలుగులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సూర్య కిరణాలు నేరుగా స్వామివారి పాదాలకు తాకే అద్భుత దృశ్యాలు.. భక్తులను కనువిందు చేశాయి. లేలేత సూర్యకాంతులు ప్రసరిస్తుండటంతో స్వామివారి విగ్రహం.. సువర్ణ శోభితంగా వెలుగులీనింది. అక్టోబర్ మాసంలో ఏటా సూర్య కిరణాలు.. స్వామివారి పాదాల నుంచి తలపై వరకు ప్రసరిస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Updated : 26 Oct 2023 16:12 IST
Tags :