Chandrababu: కందుకూరు దుర్ఘటన బాధితులకు చంద్రబాబు ఓదార్పు
కందుకూరు తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు పెద్దదిక్కులా తోడుంటానని... చంద్రబాబు భరోసా ఇచ్చారు. మృతుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పిన ఆయన.. ప్రతి కుటుంబానికి పార్టీ తరఫున 15 లక్షల ఆర్థికసాయం అందజేశారు. పార్టీ నేతల తరపున మరో తొమ్మిదిన్నర లక్షలు, ఎన్ఆర్ఐ తెలుగుదేశం సెల్ లక్ష రూపాయలు కలిపి.. ఒక్కో కుటుంబానికి 25 లక్షల సాయం అందే ఏర్పాట్లు చేశారు. ప్రజలను చైతన్యం చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో దురదృష్టకర ఘటన జరగిందన్న చంద్రబాబు, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Published : 29 Dec 2022 22:05 IST
Tags :