Ysrcp: కడపలో తెదేపా నేతపై రాళ్లు, కర్రలతో వైకాపా నేతల దాడి
కడప నడిబొడ్డున వైకాపా నాయకుల దౌర్జన్యకాండ సాగింది. స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో వైకాపా మూకలు రెచ్చిపోయారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా సమక్షంలో వైకాపా కార్యకర్తలు, అనుచరులు...తెదేపా నాయకుడు జమీల్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. సర్దిచెప్పాల్సిన పోలీసులు వైకాపా నాయకుల పక్షాన మాట్లాడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ దాడిని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు.
Updated : 12 Nov 2022 13:44 IST
Tags :