బ్రేకింగ్

breaking
24 Jan 2022 | 18:11 IST

AP: పీఆర్సీ వ్యవహారం.. నలుగురు సభ్యులతో కమిటీ

అమరావతి: ఏపీలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న ఆందోళనపై  రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల్లోని అనుమానాల నివృత్తికి కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా సీఎస్‌ సమీర్‌శర్మ వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. 

మరిన్ని

తాజా వార్తలు