బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 10:49 IST

సీజేఐకి హరీశ్‌ సాల్వే సహా 600 మంది లాయర్ల లేఖ

దిల్లీ: సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు హరీశ్‌ సాల్వే సహా 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు. కోర్టు తీర్పులపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడాన్ని వారు ఖండించారు.

మరిన్ని

తాజా వార్తలు