బ్రేకింగ్

breaking
06 May 2024 | 12:12 IST

దిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్‌ నిరాకరణ

దిల్లీ: మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ను నిరాకరిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతం కవిత తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇటీవల విచారణ సందర్భంగా కవితతో పాటు ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్‌ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్ట్‌ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

మరిన్ని

తాజా వార్తలు