News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (02-04-2023)

Updated : 02 Apr 2023 22:14 IST
1/29
విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ సినిమా షూటింగ్  కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా విజయ్‌ మంచులో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.
విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ సినిమా షూటింగ్  కశ్మీర్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా విజయ్‌ మంచులో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.
2/29
సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తిక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరూపాక్ష’. ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సినిమా క్యారక్టర్‌ ఇంట్రడక్షన్‌ ఈవెంట్‌లో నటి సంయుక్త ఇలా మెరిశారు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కార్తిక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరూపాక్ష’. ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సినిమా క్యారక్టర్‌ ఇంట్రడక్షన్‌ ఈవెంట్‌లో నటి సంయుక్త ఇలా మెరిశారు.
3/29
నటీమణులు రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి మంచులో దిగిన ఫొటోను మంచు లక్ష్మి తన ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఈ సమయాన్ని ఎప్పటికీ మరచిపోలేను’ అని ఆమె ట్వీట్‌ చేశారు.
నటీమణులు రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి మంచులో దిగిన ఫొటోను మంచు లక్ష్మి తన ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఈ సమయాన్ని ఎప్పటికీ మరచిపోలేను’ అని ఆమె ట్వీట్‌ చేశారు.
4/29
ఆదివారం సెలవు దినం కావడం.. మరోవైపు రంజాన్‌ పవిత్ర మాసం ఉండటంతో హైదరాబాద్‌ టౌలీచౌకీలోని ఓ హోటల్‌లో హలీమ్‌ రుచి చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు. ఆదివారం సెలవు దినం కావడం.. మరోవైపు రంజాన్‌ పవిత్ర మాసం ఉండటంతో హైదరాబాద్‌ టౌలీచౌకీలోని ఓ హోటల్‌లో హలీమ్‌ రుచి చూసేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు.
5/29
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో రైతులు ధాన్యాన్ని ఆరబోశారు.  దీంతో కోతుల గుంపు ఆ ధాన్యాన్ని తింటూ ఆకలి తీర్చుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో రైతులు ధాన్యాన్ని ఆరబోశారు. దీంతో కోతుల గుంపు ఆ ధాన్యాన్ని తింటూ ఆకలి తీర్చుకుంటున్నాయి.
6/29
ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. నాని కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ సినిమాను తాను చూసినట్లు తెలిపారు. సినిమా బాగుందని చిత్రబృందం కృషి ప్రశంసనీయమని చెప్పారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ప్రభాస్‌ ఆకాంక్షించారు. ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌ ఇన్‌స్టా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. నాని కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ సినిమాను తాను చూసినట్లు తెలిపారు. సినిమా బాగుందని చిత్రబృందం కృషి ప్రశంసనీయమని చెప్పారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ప్రభాస్‌ ఆకాంక్షించారు.
7/29
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఆదివారం తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని నదిలో పడవపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఆదివారం తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని నదిలో పడవపై ఊరేగింపుగా తీసుకెళ్లారు.
8/29
కరీంనగర్‌లో ఆదివారం ఘనంగా మట్టల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఊరేగింపుగా తరలి వెళ్లారు. కరీంనగర్‌లో ఆదివారం ఘనంగా మట్టల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఊరేగింపుగా తరలి వెళ్లారు.
9/29
బేగంపేటలోని కంట్రీ క్లబ్‌ ప్రాంగణంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌ (ఐఐఎంసీ) స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థులు హాజరై సందడి చేశారు. పలువురు మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్‌ ప్రాంగణంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌ (ఐఐఎంసీ) స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థులు హాజరై సందడి చేశారు. పలువురు మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు.
10/29
తుపాకీ బొమ్మతో హొయలు పోతున్న మోడల్‌ తుపాకీ బొమ్మతో హొయలు పోతున్న మోడల్‌
11/29
ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లు జరుగుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఓ ఆసక్తికరమైన ఫొటోను పంచుకుంది. ‘మా అధికారిక డిజిటల్‌ కంటెంట్ భాగస్వామి హోంబలే ఫిల్మ్స్‌తో జత కట్టాం. సరికొత్త వీడియోల కోసం సిద్ధంగా ఉండండి’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లు జరుగుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఓ ఆసక్తికరమైన ఫొటోను పంచుకుంది. ‘మా అధికారిక డిజిటల్‌ కంటెంట్ భాగస్వామి హోంబలే ఫిల్మ్స్‌తో జత కట్టాం. సరికొత్త వీడియోల కోసం సిద్ధంగా ఉండండి’ అని ట్వీట్‌ చేసింది.
12/29
నాని కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ కళాకారుడు వినూత్నంగా తీర్చిదిద్దిన సినిమా పోస్టర్‌ను నాని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. చిత్రకళలో నైపుణ్యం బాగుందని కితాబిచ్చారు. నాని కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ కళాకారుడు వినూత్నంగా తీర్చిదిద్దిన సినిమా పోస్టర్‌ను నాని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. చిత్రకళలో నైపుణ్యం బాగుందని కితాబిచ్చారు.
13/29
నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ధర్మవరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి నేతకార్మికులు లోకేశ్‌ను పట్టువస్త్రాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ధర్మవరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి నేతకార్మికులు లోకేశ్‌ను పట్టువస్త్రాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
14/29
కిరణ్‌ అబ్బవరం అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఏప్రిల్‌ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. కిరణ్‌ అబ్బవరం అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఏప్రిల్‌ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
15/29
చెన్నైలో నిర్వహించిన ‘బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్‌ ఐకాన్స్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో సినీనటి నయనతార ఇలా మెరిశారు. చెన్నైలో నిర్వహించిన ‘బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్‌ ఐకాన్స్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో సినీనటి నయనతార ఇలా మెరిశారు.
16/29
ఉప్పల్‌లో జరుగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ను ప్రముఖ సినీనటుడు వెంకటేశ్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన చప్పట్లతో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఉప్పల్‌లో జరుగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ను ప్రముఖ సినీనటుడు వెంకటేశ్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన చప్పట్లతో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
17/29
సినీనటి శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సినీనటి శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
18/29
సినీనటి కీర్తి సురేశ్‌ దసరా సినిమా సెట్స్‌లో ‘సిల్కు బార్’ వద్ద దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. సెట్‌ తొలగించే సమయంలో పరుగెత్తి మరీ.. ఈ ఫొటో తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ‘మీకందరికి తెలిసిందే.. సిల్కు బారులో నేను చేసేదేం లేదు’ అని ఫన్నీగా పోస్టు పెట్టారు. సినీనటి కీర్తి సురేశ్‌ దసరా సినిమా సెట్స్‌లో ‘సిల్కు బార్’ వద్ద దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. సెట్‌ తొలగించే సమయంలో పరుగెత్తి మరీ.. ఈ ఫొటో తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ‘మీకందరికి తెలిసిందే.. సిల్కు బారులో నేను చేసేదేం లేదు’ అని ఫన్నీగా పోస్టు పెట్టారు.
19/29
సినీనటి శివానీరాజశేఖర్‌ ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పసుపు రంగు చీరలోఉన్న ఆమెఫొటోకుఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.. సినీనటి శివానీరాజశేఖర్‌ ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పసుపు రంగు చీరలోఉన్న ఆమెఫొటోకుఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు..
20/29
శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్‌ 2’. ఈ సినిమా చిత్రీకరణను ప్రస్తుతం తైవాన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ శంకర్‌ ఈ ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇండియన్‌ 2’. ఈ సినిమా చిత్రీకరణను ప్రస్తుతం తైవాన్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ శంకర్‌ ఈ ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.
21/29
వరల్డ్‌ ఆటిజం డే సందర్భంగా హైదరాబాద్‌లోని  కోకాపేటలో ‘వాక్‌ ఫర్‌ ఆటిజం’ పేరుతో 2కె వాక్‌ నిర్వహించారు. సుమారు 1000 మందికి పైగా నగరవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరల్డ్‌ ఆటిజం డే సందర్భంగా హైదరాబాద్‌లోని కోకాపేటలో ‘వాక్‌ ఫర్‌ ఆటిజం’ పేరుతో 2కె వాక్‌ నిర్వహించారు. సుమారు 1000 మందికి పైగా నగరవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
22/29
సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియం వద్ద ఫ్యాన్స్‌ సందడి నెలకొంది. పెద్దఎత్తున వచ్చిన అభిమానులు ఇరు జట్లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కనిపించారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ స్టేడియం వద్ద ఫ్యాన్స్‌ సందడి నెలకొంది. పెద్దఎత్తున వచ్చిన అభిమానులు ఇరు జట్లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కనిపించారు.
23/29
ఉప్పల్‌ స్టేడియంలో యువతుల సందడి ఉప్పల్‌ స్టేడియంలో యువతుల సందడి
24/29
తెదేపా ఎన్నారై సెల్ ద్వారా శిక్షణ పొందిన 25 మందికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఐటీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. గత కొంతకాలంగా తెదేపా కేంద్ర కార్యాలయంలో నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. తెదేపా ఎన్నారై సెల్ ద్వారా శిక్షణ పొందిన 25 మందికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఐటీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. గత కొంతకాలంగా తెదేపా కేంద్ర కార్యాలయంలో నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
25/29
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి అడుగుపెట్టి 10ఏళ్లు అవుతున్న సందర్భంగా భువనేశ్వర్‌ కుమార్‌ జట్టు సభ్యుల మధ్య కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి అడుగుపెట్టి 10ఏళ్లు అవుతున్న సందర్భంగా భువనేశ్వర్‌ కుమార్‌ జట్టు సభ్యుల మధ్య కేకు కోసి సంబరాలు చేసుకున్నారు..
26/29
సరిగ్గా ఇదే రోజున 12 ఏళ్ల క్రితం భారత్‌.. వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆరోజును ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతూ మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. సరిగ్గా ఇదే రోజున 12 ఏళ్ల క్రితం భారత్‌.. వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆరోజును ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతూ మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.
27/29
సినీనటి రాశీఖన్నా తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆమె ఫ్యాన్స్‌ లైక్‌లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాశీఖన్నా నటించిన ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సినీనటి రాశీఖన్నా తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆమె ఫ్యాన్స్‌ లైక్‌లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాశీఖన్నా నటించిన ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
28/29
నాని కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.71కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. నాని కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.71కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
29/29
హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో ఆదివారం ఉదయం జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో అహింసా రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని పరుగు తీశారు. హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని జలవిహార్‌లో ఆదివారం ఉదయం జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో అహింసా రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని పరుగు తీశారు.
Tags :

మరిన్ని