News in pics: చిత్రం చెప్పే సంగతులు-02(03-02-2023)
Updated : 03 Feb 2023 22:03 IST
1/25
యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరు కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
2/25
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటించిన చిత్రం ‘పాప్కార్న్’. మురళి గంధం దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం కాకినాడ ‘కైట్’ మహిళా కళాశాలకు వెళ్లింది. ఈ సందర్భంగా అవికా గోర్, సాయిరోనక్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, సెల్పీలు తీసుకుంటూ సందడి చేశారు. ‘పాప్కార్న్’ ఈ నెల 10న ప్రేక్షకుల మందుకు రానుంది.
3/25
సాయి రోనక్తో సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థినులు
4/25
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 100కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాత్ర సాగుతున్న పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో లోకేశ్ డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
5/25
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి రైవాడ జలాశయం సమీపంలో ఓ మర్రిచెట్టు పెరిగి గూడులా మారింది. పెరుగుతున్న ఊడలు తీసేయడంతో పైకప్పులా ఏర్పడి రైతులను ఎండ, వాన నుంచి కాపాడుతోంది. గుబురుగా పెరగడంతో చుక్క వర్షపు నీరు కింద పడటంలేదు. ఈ దారిలో వెళ్లే బాటసారులు సైతం ఇక్కడే సేద తీరుతుంటారు.
6/25
దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో ‘కింగ్ ఆఫ్ కోట’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఓనమ్ పండగ కానుకగా(ఆగస్టులో) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
7/25
మలేసియాలోని కౌలాలంపూర్ టవర్ నుంచి బేస్ జంపర్స్ ఇలా డైవ్ చేసి సాహసోపేత విన్యాసాలు చేశారు..
8/25
గాలిలో తేలియాడుతున్న బేస్ జంపర్స్
9/25
హైదరాబాద్ చిక్కడ్పల్లిలోని న్యూఎరా కళాశాల వార్షికోత్సవాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
10/25
నృత్య ప్రదర్శన ఇస్తున్న న్యూఎరా కళాశాల విద్యార్థినులు
11/25
ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం పొగమంచు కురిసింది. చలిగాలుల తీవ్రతకు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వణికిపోయారు. మధ్యాహ్నం వరకు చలితీవ్రత కొనసాగింది.
12/25
అమెరికన్ నటి, గాయని ‘కాట్ గ్రాహమ్’ లాస్ ఏంజెలెస్లో నిర్వహించిన బ్లాక్ మ్యూజిక్ కలెక్టివ్ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
13/25
‘యువగళం’ పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొగిలి దేవాలయం సమీపంలోని క్యాంపు సైట్ వద్ద ‘సెల్ఫీ విత్ లోకేశ్’ నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనతో సెల్ఫీ దిగి సంబరపడ్డారు.
14/25
నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రంలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ.. వారి బాగోగులను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
15/25
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
16/25
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్లో ఈ నెల 9న భారత్, ఆస్ట్రేలియాల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు కోహ్లీ, పుజారా, జడేజా గ్రౌండ్లో ప్రాక్టీసు చేస్తూ కనిపించారు.
17/25
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఇలా అసెంబ్లీకి కలిసి వచ్చారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
18/25
ఫిబ్రవరి 11న నెక్లెస్ రోడ్డులోని హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో ఫార్ములా-ఈ రేసులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కొన్ని ఎస్కార్ట్ వాహనాలు హైదరాబాద్ చేరుకున్నాయి.
19/25
సీఎస్ఆర్(కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా హీరో మోటార్స్ యాజమాన్యం తిరుపతిలో 120 ద్విచక్రవాహనాలను పోలీసులకు వితరణగా అందజేసింది. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, హీరో ఆటోమొబైల్స్ ఎండీ చక్రవర్తి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.
20/25
యాదాద్రి భువనగిరిలోని పాతగుట్టలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాల్గో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్న యాదగిరీశుడు..
21/25
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
22/25
అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.
23/25
అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ఎప్పుడు ఉండే దాని కంటే మూడింతల బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం.
24/25
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
25/25
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం