మాంగల్యానికి అధిదేవత ఆమె...

వివాహ క్రతువులో వధువుతో గౌరీ పూజ చేయిస్తారు ఎందుకు?భారతీయ సంప్రదాయంలో వివాహం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం. ఈ క్రతువు ప్రారంభంలో వధువుతో గౌరీపూజ చేయిస్తారు.

Published : 31 Jan 2019 00:36 IST

వివాహ క్రతువులో వధువుతో గౌరీ పూజ చేయిస్తారు ఎందుకు?
భారతీయ సంప్రదాయంలో వివాహం అనేది ఒక పవిత్రమైన యజ్ఞం. ఈ క్రతువు ప్రారంభంలో వధువుతో గౌరీపూజ చేయిస్తారు. దంపతులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని దర్శించటంతో ఈ క్రతువు పూర్తవుతుంది. సతీత్వసిద్ధికి అరుంధతీ
సందర్శనం. మాంగల్య సౌభాగ్య సిద్ధికోసం గౌరీపూజ చేయాలని చెబుతారు. గౌరీదేవి మాంగల్యానికి అధిదేవత. ఆమెకు ‘సర్వమంగళా’, ‘మంగళగౌరీ’ అనే పేర్లున్నాయి. గౌరీదేవి భర్త అయిన పరమశివుడు కాలకూట విషం తాగినా ఆమె సౌభాగ్యానికి అంతరాయం కలుగలేదు. తన భర్త విషం స్వీకరించడానికి సిద్ధపడిన వేళలో ఆమె కలవరపడలేదు.  వివాహం చేసుకోబోయే వధువు ముందుగా ఆ తల్లిని ఆరాధించడం ద్వారా పరిపూర్ణమైన సౌభాగ్యాలను పొందుతారు.

-మల్లాప్రగడ శ్రీమన్నారాయణ

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని