ఇష్టంగానే చేయాలి...
జీవితం క్షణికమైంది, పరుల కోసం జీవించడంలోనే పరమార్థముంది. స్వార్థరాహిత్యం, కీర్తికాంక్ష లేని దానం, పరోపకారం మనం అలవరచు కోవాల్సిన సద్గుణాలు. అవి నేర్చుకున్నప్పుడు వస్తుప్రేమ, కూడబెట్టడం ఉండవు.
జీవితం క్షణికమైంది, పరుల కోసం జీవించడంలోనే పరమార్థముంది. స్వార్థరాహిత్యం, కీర్తికాంక్ష లేని దానం, పరోపకారం మనం అలవరచు కోవాల్సిన సద్గుణాలు. అవి నేర్చుకున్నప్పుడు వస్తుప్రేమ, కూడబెట్టడం ఉండవు. ఏ ప్రలోభాలూ తలెత్తవు. స్వార్థాన్ని అవినీతిగా భావిస్తారు. ఇవ్వడంతోనే ఆనందం ఉందని నమ్ముతారు. తేనెటీగలెంతో శ్రమించి సేకరించిన తేనె మరెవరికో దక్కడం తెలిసిందే. మనమైనా అంతే. సంపదలను సద్వినియోగం చేయకుండా లోభత్వం చూపితే కాలమనే ఎలుగుబంటి లాక్కుంటుంది. కనుక దానధర్మాలు ఇష్టపూర్వకంగానే చేయాలి. బలవంతంగా చేసేవాటికి ఫలితం శూన్యం. స్వార్థాన్ని విడిచిన వ్యక్తే నిజమైన ఆధ్యాత్మికవేత్త. నూరు భక్తి బోధల కంటే ఒకరికి అన్నం పెట్టడం మంచిది, తీర్థ యాత్రలు చేయడం కంటే దీనుల సేవలో తరించడం ఉత్తమం అన్నారు. ప్రేమ తత్వాన్ని వ్యాప్తి చేయడమే అసలైన జీవితమని బుద్ధుడు, ఆదిశంకరులు, తిరువళ్లువర్, పోతులూరి వీరబ్రహ్మం లాంటివారు హితవు చెప్పారు. ఆ పాఠాలను అర్థం చేసుకుని, ఆచరిస్తూ ధన్యులమవడమే మన కర్తవ్యం.
పద్మజ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!