బేసి అయినా సరే!

ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? శ్యామ్‌ప్రసాద్‌, హైదరాబాద్‌ ఆలయం అంటే పరమాత్ముని నిలయం. ఈ శరీరం ఆలయం చుట్టూ తిరగడమే ప్రదక్షిణం.

Published : 20 Sep 2018 01:33 IST

ధర్మసందేహం
బేసి అయినా సరే!

ఆలయంలో ప్రదక్షిణలు ఎన్ని చేయాలి?

శ్యామ్‌ప్రసాద్‌, హైదరాబాద్‌

* ఆలయం అంటే పరమాత్ముని నిలయం. ఈ శరీరం ఆలయం చుట్టూ తిరగడమే ప్రదక్షిణం. గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మనసును దైవంపై నిలపాలి. ఈ ప్రపంచమంతా పరమాత్మకు ఆలయమనీ, భగవంతుడు సర్వాంతర్యామి అనీ వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. దైవం అంతటా ఉన్నాడన్న భావనతో మనం వేసే ప్రతి అడుగూ ప్రదక్షిణమే అవుతుందని ఆదిశంకరులు ప్రబోధించారు.

* గుళ్లో ప్రదక్షిణ విషయానికి వస్తే.. ప్రధాన ఆలయానికీ, ఉప ఆలయాలకూ కలిపి ఒకేసారి ప్రదక్షిణం చేయవచ్చు. ఎందుకంటే వివిధ ఆలయాల్లో, వివిధ రూపాలతో కొలువై ఉన్నా.. పరమాత్ముడు ఒక్కడే! ఈ సత్యాన్ని గుర్తించి అన్ని ఆలయాలకు కలిపి ఒకేసారి ప్రదక్షిణం చేయవచ్చు.

* ఆగమశాస్త్రం ప్రకారం మూలవిరాట్టులోని దైవీశక్తి ఉత్సవ విగ్రహం, పాదుకలు, ధ్వజస్తంభం, అర్చకునిలో కొలువై ఉంటుంది. కాబట్టి.. ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణ చేయాలని పెద్దల మాట.

* ఇన్ని ప్రదక్షిణలు చేయాలన్న నియమం ఎక్కడా లేదు.  సంఖ్య కన్నా ఎంత శుద్ధితో ప్రదక్షిణలు చేశామన్నదే ముఖ్యం. మనస్సు సత్వ, రజో, తామస గుణాలతో సమ్మిళితమై ఉంటుంది. త్రిగుణాలతో కూడిన మనస్సును, మన సంకల్పాలను దైవానికి సమర్పించడమే ప్రదక్షిణలోని ఆంతర్యం. కనుక మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు. ఎక్కువ చేస్తే తప్పేమీ కాదు. సరి, బేసి పట్టింపులూ అవసరం లేదు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని