తొలిరోజే 1125 ఫ్లాట్ల బుకింగ్‌లతో రికార్డు

మైహోం సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెల్లాపూర్‌లో కొత్తగా ప్రారంభించిన సయుక్‌ ప్రాజెక్ట్‌లో తొలిరోజే 1125 ఫ్లాట్ల బుకింగ్స్‌ అయినట్లు సంస్థ తెలిపింది. బుక్‌ అయిన ప్లాట్ల విలువ రూ.1800 కోట్లు అని వెల్లడించింది. 2016లో తొలిరోజు

Published : 11 Jun 2022 06:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: మైహోం సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెల్లాపూర్‌లో కొత్తగా ప్రారంభించిన సయుక్‌ ప్రాజెక్ట్‌లో తొలిరోజే 1125 ఫ్లాట్ల బుకింగ్స్‌ అయినట్లు సంస్థ తెలిపింది. బుక్‌ అయిన ప్లాట్ల విలువ రూ.1800 కోట్లు అని వెల్లడించింది. 2016లో తొలిరోజు వెయ్యి ఫ్లాట్ల బుకింగ్స్‌తో తమ పేరిట ఉన్న రికార్డును తిరగరాసినట్లు వెల్లడించింది.  ‘దీనిని మేము రికార్డుగా పరిగణించడం కంటే కూడా  కొనుగోలుదారులు మాపై  మరింత నమ్మకం ఉంచినట్లుగా భావిస్తా’ మని మైహోం ఎండీ జూపల్లి శ్యామ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని