కీసరగుట్ట
గుట్టంతా శివలింగాలమయమే
అది... రాముడు నడయాడిన నేల. అక్కడ... గుట్టంతా శివ లింగాలమయమే. ప్రతి లింగమూ స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపమే. అక్కడ పరమేశ్వరుడు... శ్రీరాముడి చేతుల మీద వెలసి రామలింగేశ్వరుడిగా సేవలందుకుంటున్నాడు. ఆ పుణ్యక్షేత్రమే... కీసరగుట్ట.
తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందింది కీసరగుట్ట. ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు(సింహాలు) గుంపులుగా సంచరించినందు వల్ల ఇది కేసరగిరి అయ్యిందంటారు. వానరరాజు కేసరిగిరి(ఆంజనేయుడి తండ్రి) నివాసం కావడంతో ఈ క్షేత్రం కేసరిగిరి అయ్యిందనేది పురాణం. క్షేత్రంలోని విజయ స్తూపం మీది మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, కేసరి, ఆంజనేయ విగ్రహాల ఆధారంగా ఈ క్షేత్రం శైవ, వైష్ణవ సంప్రదాయాల మేలుకలయికగా విరాజిల్లుతోంది. రామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక విశేషమైతే, స్వామికి చేసిన అభిషేకాల నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంతుపట్టకపోవడం మరో విశేషం. |
స్థల పురాణం... త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి, హనుమంతుడితో రావణ సంహారం తర్వాత వన విహారానికి వచ్చి ఇక్కడి ప్రకృతి రమణీయతకు పులకించి, కొంతకాలం ఇక్కడ ఉండిపోయారు. రావణుని హతమార్చినందుకు హత్యా పాతక నివారణ కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరాముడు నిర్ణయించాడు. కాశీకి వెళ్లి ఒక జ్యోతిర్లింగాన్ని తేవాల్సిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. రామాజ్ఞ ప్రకారం శివలింగాన్ని తెచ్చేందుకు హనుమ కాశీకి వెళ్లాడు. అక్కడ ఆంజనేయుడు శివ మహిమకు ప్రభావితుడై నూటొక్క శివలింగాలను శ్రీరాముని పూజకు తీసుకువచ్చినట్లు పురాణం. ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకురావడంలో కాలయాపన జరగడంతో శ్రీరాముడు శివుని ప్రార్ధించి లింగరూపధారియైన ఆయన విగ్రహాన్ని మహర్షులు నిర్ణయించిన సుముహూర్తానికి ప్రతిష్ఠించి, అభిషేకించి హత్యాపాతకం నుంచి విముక్తిపొందాడు. ఇంతలో కాశీ నుంచి నూటొక్క లింగాలతో తిరిగి వచ్చిన హనుమ శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయడంతో తాను తెచ్చిన లింగాలలో ఒక్క లింగమైనా రామపూజకు నోచుకోనందుకు వ్యథచెందాడు. అది గమనించిన శ్రీరాముడు హనుమను ఓదార్చి తాను ప్రతిష్ఠించిన శివ దర్శనం అనంతరం కాశీ నుంచి తెచ్చిన నూటొక్క శివలింగాలను భక్తులు దర్శించేలా వరమిచ్చాడని పురాణగాథ. ప్రధాన ఆలయం వెనుక ఏకశిలతో ఏర్పడిన సీతమ్మగుహ కూడా భక్తులకు కనువిందు చేస్తుంది. చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతున్న కీసరగుట్ట మహత్యాన్ని ఎంతగా వర్ణించినా చాలదు, ఒక్కసారైనా సందర్శించి తీరాల్సిందే. |
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
-
India News
Shashi Tharoor: శశిథరూర్కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
- Tamil Rockerz: ‘సినీ పైరసీ భూతం’ హెడ్ అతడే.. ‘తమిళ్ రాకర్స్’ ట్రైలర్ చూశారా!