Chandrababu: గ్రీజే పెట్టలేరు!
ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు
అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు ఏడాదైనా మరమ్మతులు చేయించలేదు
షెకావత్ వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాలి
సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి
చంద్రబాబు డిమాండ్
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని, ఏడాదైనా మరమ్మతు చేయించలేని.. ఈ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతారంట అని విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఒకరిని చంపితే హత్యాయత్నం కేసు పెడతారు.. అన్నమయ్య ప్రాజెక్టులో 45 మందిని బలిగొంటే మీ మీద కేసుల్లేవా?
చట్టపరమైన చర్యల్లేవా?’ అని నిలదీశారు. ‘సీఎం చేతగానితనం కారణంగానే వరదల వల్ల రూ.6వేల కోట్ల ఆస్తి నష్టం, 62 మంది ప్రాణాలు పోయాయి. ఇందుకు ఆయనే బాధ్యుడు. ఆయన్ను రాజీనామా చేయమన్నా.. పదవికి అర్హత లేదన్నా అవి తక్కువ మాటలే...’ అని మండిపడ్డారు. సమగ్ర న్యాయవిచారణ చేయించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెల్లించాలని, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండు చేశారు.
కేంద్ర మంత్రి షెకావత్కే ఏం తెలియదంటారా?
అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రి షెకావత్ వివరాలు వెల్లడిస్తే...‘ముంచేసింది కాక.. సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగుతారా? ఆయనకు ఏమీ తెలియదంటారా...’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్కుమార్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? మీపై కేసులు ఉండవా?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ రాజ్యసభలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ను ప్రదర్శించారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... తిరుపతిలో తుమ్మలగుంట చెరువును స్టేడియంగా మార్చడంతో వరద ప్రవాహం పద్మావతి విశ్వవిద్యాలయం, రైల్వేస్టేషన్ దిగువ భాగంలో ప్రవహించడంతో 14 అడుగుల ఎత్తులో నీరు నిలిచిందని చెప్పారు. రాయలచెరువు లీకేజీని అరికట్టడంలో నిర్లక్ష్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లా పెన్నానదిలో ఇసుక తవ్వకాల కారణంగా పొర్లు కట్టలు బలహీనపడడంతో రూ.2వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని, వేల కుటుంబాలు తమ సర్వస్వాన్ని కోల్పోయాయని చెప్పారు. సీఎం ఇప్పుడొచ్చి పొర్లుకట్ట కోసం వంద కోట్లు ఖర్చు పెడతామని, తానొచ్చి శంకుస్థాపన చేస్తానంటున్నారన్నారు. శ్మశానానికి శంకుస్థాపన చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు.
వీసీని చూస్తే జాలేస్తోంది
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిని చూస్తే జాలేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎందుకు ఆ పదవి? రాజీనామా చేసి ఇంటికి పోయిండొచ్చు.. వేధింపులతో కళ్లనీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆయనో అసమర్థ వ్యక్తిగా మిగిలిపోతారు. జీవితాంతం అంతర్మథనం చెందుతారు...’ అని చెప్పారు. ‘ఉద్యోగులు పైసా, పైసాగా దాచుకున్న వాటితో పాటు విద్యార్థుల సొమ్ము తదితరాలు కలిపి రూ.400 కోట్లు ఉంటే వాటిపైనా కన్నేస్తారా?’ అని నిలదీశారు.
సీఎం జగన్ కడప పర్యటన సందర్భంగా వరద బాధితులను అధికారులతో భయపెట్టించి.. పోలీసు కేసులు పెడతామని బెదిరించి.. బయటకు రాకుండా చేశారు. బాధితుల కంటే ఎక్కువ మంది పోలీసులను మోహరించారు. ఇది ఓదార్పు అవుతుందా? పరామర్శకు వెళ్లిన సీఎంతో ఒక ముసలావిడ నవ్వుతూ మాట్లాడుతోంది.. అంతా బాగుందంటూ వరదను స్వాగతించింది. ఎక్కడైనా ఇలా జరుగుతుందా? 62 మంది చనిపోతే ఆ బాధ అక్కడి వారిలో ఉండదా? బయట నుంచి జనాలను తెచ్చారు. అదీ జగన్ మార్కు రాజకీయం.
- విలేకరుల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం
ఉన్నట్టుండి అన్ని నీళ్లు పడితే ఇంకేంది బతికేది
అన్నమయ్య ప్రాజెక్టు వరద గ్రామాలపైకి వస్తున్న సమయంలో స్థానికులు తీవ్ర ఆందోళనతో మాట్లాడుకున్న వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు. అందులో ఒక వీడియోలో... ‘నరసింహా.. పాయె నరసింహా? ఇల్లు ఒక్కటుండదు.. ఇల్లు పోయింది (రెండు సెకన్లలోనే).. ఉన్నట్టుండి అన్ని నీళ్లు పడితే ఇంకేంది బతికేది.. ఆవులు చచ్చిపోతాయి నరసింహా?’ అని ఒక బాధితుడు తన ఆందోళనను వ్యక్తం చేశారు. ‘చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. దాని కోసం నదిలోకి లారీలు వెళ్తాయి. గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయనే ఉద్దేశంతోనే అవి బయటకు వచ్చే వరకు డ్యాం గేట్లు ఎత్తనీయకుండా ఆపారు...’ అని మరికొందరు ఆరోపించారు. వరదల అనంతరం ఎగువమందపల్లికి చెందిన వెంకటసుబ్రమణ్యం మాట్లాడుతూ...‘‘సార్, గేట్లు ఎత్తమని.. ఏఈ, డీఈని ఫోన్ చేసి అదే పనిగా అడిగాం. ఇబ్బంది పడతామని వారికి చెప్పినా ‘నాకు తెలుసు.. నాకు తెలుస’ని అన్నారు ఇసుక రవాణాకు వందకు పైగా లారీలు ఉన్నాయి. నీరు విడుదల చేస్తే అవి కొట్టుకుపోతాయనే ఇలా చేశారు..’’ అని పేర్కొన్న వీడియోను ప్రదర్శించారు. కొన్ని సంఘటనలను చంద్రబాబు వివరిస్తూ... ‘ముందస్తు హెచ్చరికల్లేకుండా నీటిని విడుదల చేయడంతో ఒక పూజారి కుటుంబంలో అతడి కళ్ల ముందే తొమ్మిది మంది చనిపోయారు. అదే గ్రామంలో ఒక యువకుడు ఇంటి సీలింగ్కు ఉండే ఇనుప కొక్కీని ముప్పావు గంట నుంచి గంట వరకు పట్టుకొని... తొమ్మిది మందిని తన భుజం, కాళ్లపై ఎక్కించుకున్నారు. వారిలో ఇద్దరు శ్వాస ఆడక.. ఆయన భుజంపైనే చనిపోయి కిందపడిపోయారు. ఏడుగురిని కాపాడగలిగారు. ఆయన ధైర్యం, సమయస్ఫూర్తి, వారి ప్రాణాల్ని కాపాడింది. ఒక గ్రామ సర్పంచి.. వరదొస్తోందని బయటికొచ్చి ఊరంతా చెప్పారు. ఆయన ఇంట్లోకి నీరొచ్చేసింది. ఇంటికొచ్చి చూసేసరికి ముగ్గురు కొట్టుకుపోయారు....’ అని పేర్కొన్నారు.
‘చచ్చిపోతున్నాం.. ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి..?
‘చచ్చిపోతున్నాం.. ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి..? ఎందుకు మాకీ బాధలు ఎందుకు?’ అంటూ ఓటీఎస్ చెల్లింపులపై ఒక మహిళ కన్నీటి పర్యంతమవుతూ... తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్న వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ