తాడేపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారం ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎస్‌ సమీర్‌ శర్మ,

Published : 04 Jul 2022 04:58 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారం ఉదయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎస్‌ సమీర్‌ శర్మ, మంత్రి జోగి రమేష్‌, కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, కలెక్టర్‌ రంజిత్‌ బాషా తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు. కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్‌ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు జూన్‌ 28న సీఎం ప్యారిస్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని