వ్యాపార ధోరణికే ప్రాధాన్యమా?
తిరుమల శ్రీవారి సేవల విషయంలో తితిదే తీరును హైకోర్టు ఆక్షేపించింది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి మేల్ఛాట్ వస్త్రసేవ, ఆర్జితసేవల కోసం 14 ఏళ్ల కిందట భక్తులు బుక్ చేసుకున్న
14 ఏళ్ల కిందట బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేస్తారా?
తితిదే తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
మేల్ఛాట్ వస్త్ర, ఆర్జిత సేవల నిరాకరణపై ఆగ్రహం
పిటిషనర్లకు సేవల భాగ్యం కల్పించాలని ఆదేశం
ఈనాడు, అమరావతి: తిరుమల శ్రీవారి సేవల విషయంలో తితిదే తీరును హైకోర్టు ఆక్షేపించింది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి మేల్ఛాట్ వస్త్రసేవ, ఆర్జితసేవల కోసం 14 ఏళ్ల కిందట భక్తులు బుక్ చేసుకున్న టికెట్లను కొవిడ్ సాకుతో రద్దుచేయడాన్ని తప్పుపట్టింది. ‘గతంలో టికెట్లు పొందిన భక్తులకు కొవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పాడ్డాక ఆర్జిత సేవలు కల్పిస్తే.. దేవస్థానం కొత్తగా, అధికంగా ఆదాయం పొందలేదు. అందుకే.. కొత్తవారికి అవకాశం కల్పిస్తూ వారి నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తోంది. ఇలాంటి వ్యవహార శైలి.. భక్తుల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడమే. వ్యాపార ధోరణికే దేవస్థానం ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది’ అని ఆక్షేపించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
* శ్రీవారి మేల్ ఛాట్ వస్త్రసేవ నిమిత్తం 2007 జులైలో ఈ-టికెట్ బుక్ చేసుకున్న తనకు 2021 డిసెంబరు 17న కల్పించిన సేవను కొవిడ్ను కారణంగా చూపుతూ తితిదే రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ భక్తుడు ఆర్.ప్రభాకరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రభాతం, తదితర సేవలకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేశారని మరికొందరు వ్యాజ్యాలు వేశారు. బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవల టికెట్కు చెల్లించిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తితిదే కోరింది. తమ మనోభావాలను గౌరవించకుండా ఏకపక్షంగా సేవల టికెట్లను రద్దు చేసిందని వ్యాజ్యం వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎం.విద్యాసాగర్, సీహెచ్ ధనుంజయ్ వాదనలు వినిపిస్తూ.. ‘14 ఏళ్ల కిందట టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు చట్టబద్ధంగా అర్హులు. సేవలు పునఃప్రారంభమయ్యాక ఒకటి రెండేళ్లలోపు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 17,490 మంది టికెట్ పొందితే 8,347 మందే బ్రేక్ దర్శనం పొందారు. 191 మందే టికెట్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరారు. పిటిషనర్లతో పాటు మిగిలిన వారు ఎలాంటి ఐచ్ఛికాన్ని తెలపలేదు’ అని పేర్కొన్నారు.
* తితిదే అధికారులు కౌంటర్ దాఖలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో స్వామివారి దర్శనాన్ని నిలిపేశామని, అప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపామని వివరించారు. కొవిడ్ తగ్గాక, అప్పటికే వివిధ తేదీల్లో సేవలు టికెట్ బుక్ చేసుకున్న వారు ఉంటారని, పూర్వం బుక్ చేసుకున్న వారిని సర్దుబాటు చేయలేమని చెప్పారు. తమ నిర్ణయం సహేతుకమైనదేనని, వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తితిదే వాదనలను తప్పుపట్టారు. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో ఆర్జిత సేవల టికెట్ బుక్ చేసుకోవాలని తితిదే మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. కొత్తగా బుక్ చేసుకున్న భక్తులకు అవకాశం కల్పిస్తూ.. గతంలో బుక్ చేసుకున్న వారికి సేవలు నిరాకరించడం అధికరణ 14ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. పిటిషనర్లు కోరుకున్నట్లు ఆర్జిత సేవ అందించేందుకు అనుమతి ఇవ్వాలని తితిదే అధికారులను ఆదేశించింది. పిటిషనర్లకు, తితిదే అధికారులకు అనుకూలమైన తేదీ, సమయాలను ముందుగా చర్చించి ఖరారు చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం