ఈక్విటాస్‌ బ్యాంక్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా రాణి రాంపాల్‌, స్మృతి మంధాన

ప్రముఖ హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్‌, క్రికెట్‌ క్రీడాకారిణి స్మృతి మంధాన.. ఈక్విటాస్‌ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు....

Published : 03 Sep 2021 20:17 IST

చెన్నై: ప్రముఖ హాకీ క్రీడాకారిణి రాణి రాంపాల్‌, క్రికెట్‌ క్రీడాకారిణి స్మృతి మంధాన.. ఈక్విటాస్‌ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. జాతీయ హాకీ జట్టులో ఆడిన అత్యంత పిన్నవయస్కురాలిగా రాంపాల్‌ రికార్డు నెలకొల్పగా.. అంతర్జాతీయ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా బీసీసీఐ మంధానను గుర్తించింది. సెప్టెంబరు 5న ఐదో వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఈక్విటాస్ బ్యాంకు ఈ ప్రకటన చేసింది. ఈక్విటాస్‌ తమను అంబాసిడర్లుగా ఎంపిక చేయడం పట్ల ఇరువురు క్రీడాకారిణిలు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని