Gold Rate: పెరిగిన బంగారం ధర

బంగారం ధర క్రమంగా పుంజుకొంటోంది. దేశ రాజధాని నగరం దిల్లీలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర....

Published : 06 Jul 2021 16:17 IST

దిల్లీ: బంగారం ధర క్రమంగా పుంజుకొంటోంది. దేశ రాజధాని నగరం దిల్లీలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.69లు మాత్రమే పెరగ్గా.. మంగళవారం రూ.389లు  పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.46,762కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.46,373గా ఉంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.397లు పెరగడంతో మొత్తం ధర రూ.69,105కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1806 డాలర్లుగా ట్రేడవుతుండగా.. ఔన్సు వెండి ధర 26.63 డాలర్లుగా ఉంది. డాలర్‌ బలహీనపడటంతో పసిడి కొనుగోళ్లు పెరిగేందుకు దోహదపడినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకుడు (కమోడిటీస్‌) తపన్‌ పటేల్‌ పేర్కొన్నారు. మరోవైపు, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,400లకు పైగా (అన్ని ట్యాక్స్‌లతో కలిపి) ట్రేడ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని