త్వరలో ఐపీవోకు లోధా డెవలపర్స్..!
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లోధా డెవలపర్స్ ఐపీవోకు వచ్చేందుకు మూడోసారి ప్రయత్నాలను మొదలుపెట్టింది. గతంలో రెండు సార్లు ప్రయత్నించినా వివిధ కారణాలతో
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లోధా డెవలపర్స్ ఐపీవోకు వచ్చేందుకు మూడోసారి ప్రయత్నాలను మొదలుపెట్టింది. గతంలో రెండు సార్లు ప్రయత్నించినా వివిధ కారణాలతో ఆ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయాయి. తాజా కంపెనీ ఐపీవోకు సంబంధించిన పత్రాలను మార్కెట్ రెగ్యూలేటర్ అయిన సెబీకి సమర్పించింది. ఈ ఐపీవో నుంచి లోధా డెవలపర్స్ రూ.2,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. కొన్నాళ్ల క్రితం కంపెనీ మాక్రోటెక్ డెవలపర్స్గా పేరు మార్చుకొన్న విషయం తెలిసిందే. తాజా ఐపీవోకు సంబంధించిన డీఆర్హెచ్పీని సెబీకి సమర్పించింది.
గతంలో ఈ కంపెనీ 2009లో ఐపీవోకు ప్రయత్నించినా.. మార్కెట్ పరిస్థితులు బాగోక ప్రణాళికను ఉపసంహరించుకొంది. ఆ తర్వాత 2018లో మరో సారి ప్రయత్నించింది. అప్పుడు కూడా మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ఆలోచన విరమించుకొంది. ఈ సారి ఐపీవో 10శాతం వాటా విక్రయించి రూ.2,500 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి
ఒక్క మిస్డ్ కాల్తో `ఎస్బీఐ` వ్యక్తిగత లోన్
1.2 బిలియన్ డాలర్లు ఇప్పించండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM