Microsoft: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ కరోనా బోనస్‌!

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు 1,500 డాలర్ల(రూ.1.12 లక్షలు)ను సింగిల్‌ టైం బోనస్‌గా ప్రకటించింది....

Updated : 09 Jul 2021 17:01 IST

వాషింగ్టన్‌: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,500 డాలర్ల(రూ.1.12 లక్షలు) సింగిల్‌ టైం బోనస్‌ ప్రకటించింది. మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కార్పొరేట్‌ వైస్ ప్రెసిడెంట్‌ కంటే కింది స్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది. మార్చి 31, 2021కి ముందు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరి బోనస్‌ కోసం సంస్థ 200 మిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించనుంది. అయితే, కంపెనీ అనుబంధ సంస్థలైన లింక్డిన్‌, గిట్‌హబ్‌, జెనీమ్యాక్స్‌కు చెందిన ఉద్యోగులు మాత్రం బోనస్‌కు అర్హులు కాదు. ఫేస్‌బుక్ తమ సంస్థలోని 45 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,000 డాలర్ల బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. హాలిడే బోనస్‌ కింద అమెజాన్‌ సైతం 300 డాలర్లు ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని