హైదరాబాద్లో రూ.91 దాటిన పెట్రోల్
దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజు చమురు ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. బుధవారం పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 25 పైసలు పెరిగింది. దీంతో దేశ
హైదరాబాద్: దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజు చమురు ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. బుధవారం పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 25 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.60కి చేరింది. డీజిల్ ధర రూ. 77.73గా ఉంది.
హైదరాబాద్లోనూ చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నగరంలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి రూ. 91.09కి చేరింది. డీజిల్ ధర రూ. 84.79 గా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ. 94.12కు చేరింది. కోల్కతాలో రూ. 88.92, చెన్నైలో రూ. 89.96గా ఉంది. డీజిల్ ధర ముంబయిలో రూ. 84.63, కోల్కతాలో రూ. 81.31, చెన్నైలో రూ. 82.90గా ఉంది.
అంతర్జాతీయ ధరలు, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి. అయితే వ్యాట్, ఇతర పన్నులతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. తాజాగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగానూ ఇంధన ధరలు పెరిగాయి.
ఇవీ చదవండి..
పన్నుల లక్ష్యాలు సాధించగలిగేవే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!