పిల్లల కోసం 'ఎస్బీఐ' ప్రత్యేక పథకం
ఈ పథకంలో ఈక్విటీ కేటాయింపు 65 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటుంది......
ఈ పథకంలో ఈక్విటీ కేటాయింపు 65 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటుంది
పిల్లల భవిష్యత్తు కోసం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ ఆఫర్ను (ఎన్ఎఫ్ఓ) ప్రారంభించింది. పిల్లల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే తల్లిదండ్రులు దీనిలో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ ఇదే విధమైన ఉత్పత్తిని ఇప్పటికే కలిగి ఉంది, ఇది మరింత సాంప్రదాయిక విధానంతో ఉంది
ప్రత్యేకత:
పిల్లలకు 18 సంవత్సరాల వచ్చేవరకు లేదా ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఏది త్వరగా పూర్తయితే అప్పుడు తీసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లలకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు ఇందులో పెట్టుబడులు ప్రారంభిస్తే 18 సంవత్సరాలు అంటే ఒకే ఏడాదిలో తీసుకోవచ్చు లేదా కావాలనుకుంటే ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు లేవు.
తల్లిదండ్రులు, పిల్లలతో కలిపి ఉమ్మడి ఖాతాతో లేదా పిల్లల పేరుతో ఉన్న ఖాతా నుంచి పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాతో పెట్టుబడులకు వీలుండదు. 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు తల్లిదండ్రులు ఈ ఖాతాను నిర్వహించాలి. ఆ తర్వాత పిల్లల కేవైసీ పూర్తిచేసేవరకు ఖాతా నిలిచిపోతుంది. కేవైసీ పూర్తిచేసిన తర్వాత పిల్లలు ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఖాతాలో ఉన్న మొత్తంపై 2.25 శాతానికి మించి వ్యయ నిష్పత్తి ఉండదు. దీనికి డివిడెండ్ ఆప్షన్ లేదు, గ్రోత్ ఆప్షన్ ఉంటుంది.
ఈ పథకంలో ఈక్విటీ కేటాయింపు 65 శాతం నుంచి 100 శాతం వరకు ఉంటుంది. ఈక్విటీ స్కీములకు వర్తించే పన్ను పడుతుంది. అంటే ఏడాది కంటే తక్కువ కాలం ఖాతా ఉంటే స్వల్ప కాలిక పన్ను 15 శాతం, అంతకంటే ఎక్కువకాల ఉంటే దీర్ఘకాలిక పన్ను 10 శాతం వర్తిస్తుంది. ఈక్విటీలో భాగంగా స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ల్లో ఫండ్ పెట్టుబడులు పెడుతుంది.
అంతర్జాతీయ ఈక్విటీలు (35% ), బంగారం (20% ), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (REIT ) 10% వరకు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. రెండు ఆస్తి తరగతులకు (అంతర్జాతీయ ఈక్విటీలు, బంగారం) ముందుగా నిర్ణయించిన ఆస్తి కేటాయింపులు లేనప్పటికీ, ఫండ్ మేనేజ్మెంట్ బృందం వాటిని దృష్టిలో ఉంచుకుంది అని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ ఆర్. శ్రీనివాసన్ అన్నారు. ఇక డెట్ పెట్టుబడులు ఎక్కువగా ‘ఎఎఎ’ రేటింగ్ కలిగిన బాండ్లకు కేటాయిస్తారు.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇటువంటి పథకం ఇప్పటికే ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న ఎస్బీఐ చిల్ర్డన్ బెనిఫిట ఫండ్- సేవింగ్స్, ఇకపై కూడా కొనసాగుతుంది. దీనిలో ఈక్విటీలకు సున్నా నుంచి 25 శాతం వరకు మాత్రమే కేటాయింపు ఉంటుంది. మిగతాది డెట్ స్కీములకు కేటాయిస్తుంది. ఈ రెండు ఫండ్లలో లాక్-ఇన్ పీరియడ్ వంటి కొన్ని ఫీచర్లు ఒకేరంగా ఉంటాయి.
సేవింగ్స్ ఫండ్ 14-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అనువైనదిగా ఉంటుంది. అయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈ ఫండ్తో వచ్చిన బీమా రక్షణను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది వ్యక్తిగత ప్రమాదం, వైకల్యం వంటి వాటికి రూ. 3 లక్షల వరకు హామీతో ఉండేది. అయితే ఇందులో క్లెయిమ్లు చాలా తక్కువగా ఉండటం కారణంగా బీమా పాలసీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ముగింపు:
ఇటువంటి ఫండ్లు నిర్దిష్ట లక్ష్యాలను కలిగి ఉన్న వారి కోసం పనిచేస్తాయి. పిల్లల ఉన్నత విద్య వంటి ప్రత్యేక లక్ష్యాలను కలిగి ఉన్నవారికి, వారి ఇతర పెట్టుబడులను ఆ లక్ష్యాలకు అంకితభావంతో కేటాయించలేకపోయేవారికి ఉత్తమంగా పనిచేస్తాయి. పిల్లల ప్రయోజన నిధులు సాధారణంగా సాంప్రదాయికంగా ఈక్విటీలో లార్జ్ క్యాప్, డెట్ స్కీముల్లో ఉంటాయి. ఏదేమైనా, ఈ ఫండ్లో బంగారం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, అంతర్జాతీయ ఈక్విటీ పెట్టుబడులకు విస్తరించడం స్వాగతించే విషయం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు